WPL: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  భాగంగా  నేడు ముంబై ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నడుమ   కీలక మ్యాచ్ జరుగనుంది.  ఈ మ్యాచ్ లో గెలిస్తేనే  ముంబై.. ఫైనల్ చేరుకుంటుంది. 

వరుసగా ఐదు మ్యాచ్ లలో గెలిచి తర్వాత రెండింటిలో ఓడిన జట్టు ఓ వైపు.. ఆడిన ఐదు మ్యాచ్ లలో ఓడి తర్వాత రెండింటిలో గెలిచిన జట్టు మరో వైపు.. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగబోతుంది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లు లీగ్ దశలో తమ చివరి మ్యాచ్ ఆడనున్నాయి. నేటి మ్యాచ్ లో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ కు రానుంది. ఆర్సీబీ బ్యాటింగ్ చేయనుంది. కాగా ఈ సీజన్ లో హర్మన్ సేన తొలిసారి టాస్ గెలిచింది. 

ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా ఆర్సీబీకి వచ్చిన నష్టమేమీ లేదు గానీ ముంబైకి మాత్రం చాలా కీలకం. వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిన ఆ జట్టు నేటి మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ చేరుతుంది. అది కూడా భారీ స్థాయిలో గెలవాలి. 

నిబంధనలు ఇవి.. 

- డబ్ల్యూపీఎల్ నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
- రెండు, మూడు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ (ప్లేఆఫ్స్) ఆడతాయి. 
- అంటే ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం.. ఢిల్లీ నేరుగా ఫైనల్ (?) చేరితే యూపీ వారియర్స్ తో కలిసి ముంబై ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. 

నేరుగా ఫైనల్ కు వెళ్లేందుకు ఓ ఛాన్స్ ఉంది.. 

- ముంబై ఫైనల్ చేరాలంటే ఆర్సీబీతో ఆడబోయే మ్యాచ్ ముంబైకి కీలకం. ఈ మ్యాచ్ లో బెంగళూరును భారీ తేడాతో ఓడిస్తే అప్పుడు ఆ జట్టు నెట్ రన్ రేట్ పెరుగుతుంది. ఇదే క్రమంలో ఢిల్లీ కూడా.. నేటి సాయంత్రం యూపీ వారియర్స్ తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో యూపీ గనక ఢిల్లీని చిత్తుగా ఓడిస్తే అప్పుడు ముంబై మళ్లీ మొదటి స్థానానికి వెళ్లనుంది. అలా జరిగితే ముంబై.. నేరుగా ఫైనల్ ఆడొచ్చు. లేదంటే ప్లేఆఫ్స్ లో గెలిచి ఫైనల్ కు వెళ్లాల్సి ఉంటుంది. 

తుది జట్లు : 

ఆర్సీబీ : స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, హెథర్ నైట్, రిచా ఘోష్, కనిక అహుజా, శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోభన, ప్రీతి బోస్ 

ముంబై : హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, నటాలీ సీవర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమెలియా కెర్, పూజా వస్త్రకార్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమైర కాజి, జింతమణి కలిత, సైకా ఇషాక్