అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ హాట్ ఫోజు... ఫోటో క్లిక్మనిపించిన ఏబీడీ...
సముద్రంలో ఈతకొడుతూ సేదతీరిన అనుష్క, విరాట్ కోహ్లీ జోడి...
బెస్ట్ ఫ్రెండ్ జోడికి పర్ఫెక్ట్ ఫోటోతో గిఫ్ట్ ఇచ్చిన ఏబీ డివిల్లియర్స్...
సోషల్ మీడియాలో ఫోటో పోస్టు చేసిన విరాట్ కోహ్లీ...
IPL 2020 సీజన్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన ఆర్సీబీ, ఈసారి ఇప్పటికైతే మూడోస్థానంలో కొనసాగుతోంది. ఇదే రేంజ్ పర్ఫామెన్స్ కొనసాగితే ప్లేఆఫ్ చేరడం పక్కా. ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ తమ బ్యాటింగ్తో మ్యాచులను మలుపు తిప్పుతున్నారు.
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో విజయం తర్వాత భార్య అనుష్క శర్మతో కలిసి సముద్రంలో మునిగిపోయాడు విరాట్ కోహ్లీ. దుబాయ్లో ఓ అందమైన టూరిస్ స్పాట్లో భార్య అనుష్క శర్మతో కలిసి సముద్రంలో ఈత కొట్టాడు విరాట్. ఈ సమయంలో తన టీమ్ మేట్, బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిల్లియర్స్ ఈ జంటను ఫోటో తీశాడు.
ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తీసినట్టుగా వచ్చిన ఈ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ ఫోటోకి వేలల్లో లైకులు, రీపోస్టులు వస్తున్నాయి. తన బ్యాటింగ్తో ఒంటి చేత్తో విజయాలు అందించిన ఏబీడీలో మంచి ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడంటూ కామెంట్లతో ‘మిస్టర్ 360’ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు నెటిజన్లు.