ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా...
రెండో రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా స్కోరు 96/2...
ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకి 242 పరుగుల దూరంలో భారత జట్టు...
హాఫ్ సెంచరీ చేసి అవుటైన శుబ్మన్ గిల్...
పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడం వల్ల ఫలితం తేలుతుందా? తేలదా? అని భావించిన సిడ్నీ టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది టీమిండియా. శుబ్మన్ గిల్ 50 పరుగులు చేసి అవుట్ కాగా, రోహిత్ శర్మ 26 పరుగులు చేశాడు.
సిరీస్లో మొట్టమొదటిసారి టీమిండియాకి మొదటి వికెట్కి 50+ భాగస్వామ్యం నమోదుకాగా 15 పరుగుల తేడాతో ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది టీమిండియా. 77 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్తో 26 పరుగులు చేసి అవుట్ కాగా... యంగ్ బ్యాట్స్మెన్ శుబ్మన్ గిల్ 101 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు.
85 పరుగులకి 2 వికెట్లు కోల్పోగా... ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే కలిసి 13 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 11 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పూజారా 53 బంతుల్లో 9 పరుగులు చేయగా, రహానే 40 బంతుల్లో 5 పరుగులు చేశాడు. వర్షం కారణంగా మొదటి రోజు 35 ఓవర్లు నష్టపోవడంతో కీలకమైన మూడో రోజు అరగంట ముందు ఆట ప్రారంభం కానుంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 8, 2021, 1:06 PM IST