RRvsRCB: ఆర్సీబీ ఉత్కంఠ విజయం... రాజస్థాన్కి మరో ఓటమి..
కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్...
ఏబీడీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్...
IPL 2020లో నాలుగో విజయాన్ని అందుకుని, ప్లేఆఫ్ రేసులో ఉన్నామని ఘనంగా చాటాలనుకున్న రాజస్థాన్ రాయల్స్కు షాక్ ఇచ్చాడు ఏబీ డివిల్లియర్స్, ‘మిస్టర్ 360’ స్పెషల్ ఇన్నింగ్స్ కారణంగా మరో రెండు బంతులు ఉండగానే 178 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో విజయంతో 12 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్కి మరింత దగ్గరైంది ఆర్సీబీ...
ఆరో ఓటమి అందుకున్న రాజస్థాన్ రాయల్స్, ఫ్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. 179 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆరోన్ ఫించ్ 14 పరుగులకే అవుట్ కాగా, దేవ్దత్ పడిక్కల్ 35 పరుగులు చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 32 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి అవుట్ కాగా ఏబీ డివిల్లియర్స్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.
22 బంతుల్లో ఒక ఫోర్, ఆరు సిక్సర్లతో 55 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్, 19వ ఓవర్లో వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. గుర్కీరత్ మాన్ 17 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఒకానొక దశలో రాజస్థాన్ ఈజీగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ కాస్తా, ఏబీడీ ఇన్నింగ్స్ కారణంగా కోహ్లీ సేన వైపు మళ్లింది. రాజస్థాన్ బౌలర్లలో రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్ తలా ఓ వికెట్ తీశారు.