Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాతో టీ20 : పంత్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

ఈ  మ్యాచ్ లో పంత్... ధోనీని రీప్లేస్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో... నెటిజన్లు పంత్ పై తీవ్ర విమర్శలు  చేస్తున్నారు. ముఖ్యంగా రివ్యూ విషయంలో పంత్ చేసిన తప్పుపై నెటిజన్లు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. 
 

Rishabh Pant's Bad Day Behind Stumps Invites MS Dhoni Comparisons, Hilarious Memes On Twitter
Author
Hyderabad, First Published Nov 4, 2019, 10:28 AM IST

బంగ్లాదేశ్‎తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‎లో భారత్‎పై బంగ్లాదేశ్ తొలి విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‎కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కాగా... ఈ టీ 20 మ్యాచ్ కి విరాట్ కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా... సెలక్టర్లు అసలు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పట్టించుకోలేదు. ధోనీ స్థానంలో వికెట్ కీపర్ గా పంత్ ని ఎంపిక చేశారు.

అయితే... ఈ  మ్యాచ్ లో పంత్... ధోనీని రీప్లేస్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో... నెటిజన్లు పంత్ పై తీవ్ర విమర్శలు  చేస్తున్నారు. ముఖ్యంగా రివ్యూ విషయంలో పంత్ చేసిన తప్పుపై నెటిజన్లు కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. 

AlsoRead రివ్యూ కి ఒప్పించిన పంత్.... రోహిత్ కామిక్ రియాక్షన్...

10వ ఓవర్ లో... సౌమ్య శేఖర్ వికెట్ నేపథ్యంలో... రిషబ్ పంత్... డీఆర్ఎస్ రివ్యూ తీసుకుందామని భావించాడు. ఈ విషయాన్ని వెంటనే రోహిత్ శర్మ కు చెప్పాడు. పంత్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండటంతో.. రోహిత్ శర్మ కూడా కాదనలేకపోయాడు. రివ్యూ తీసుకున్నాడు. అయితే... బంగ్లా క్రికెటర్ సౌమ్య శేఖర్ ఔట్ కాలేదు. దీంతో రివ్యూ వృథా అయ్యింది. తర్వాత ముష్ఫికర్ రహిమ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రివ్యూ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అప్పటికే రివ్యూ ఆప్షన్ కోల్పోవడంతో... రోహిత్ శర్మ కామ్ గా ఉండిపోయాడు.

కాగా.. రహిమ్..బంగ్లాదేశ్ జట్టు విజయానికి భారీ స్కోర్ అందించాడు. 43బాల్స్ లో 60 పరుగులు చేశాడు. అది ఆ జట్టుకి విజయం చేకూర్చింది. పంత్ కారణంగానే ఇలా జరిగిందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ మేరకు పంత్ పై జోక్స్ వేస్తూ ట్రోల్ చేస్తున్నారు. 

వికెట్ కీపింగ్ విషయంలో.. రిషభ్ పంత్.. ధోనీని రిప్లేస్ చేయడమనేది పెద్ద జోక్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. డీఆర్ఎస్ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్ అంటూ కొందరు మెసేజ్ లు  చేయడం విశేషం. పంత్ ఆటను చూసి ధోనీ బాధపడుతున్నాడంటూ అర్థం వచ్చేలా కొన్ని మీమ్స్ ని ట్విట్టర్ లో షేర్ చేయగా.. అవి కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి.

ఇదిలా ఉండగా...మ్యాచ్ ఓటమి అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. కాపాడుకోదగిన స్కోర్ తాము చేశామని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు. కానీ... తాము చాలా తప్పులు చేశామన్నారు. ఆటగాళ్లు అంతా చాలా ఎక్స్ పీరియన్స్డ్ కాదని అన్నారు. వాళ్లు కూడా తప్పుల నుంచి  నేర్చేకుంటారని అభిప్రాయపడ్డాడు.డీఆర్ఎస్ విషయంలో తప్పులు చేశామని చెప్పాడు. బంగ్లాదేశ్ ఘనతను తక్కువ చేయకూడదని...  ఆజట్టు బాగా ఆడిందని చెప్పాడు. ఆరంభం నుంచి బంగ్లా టీం తమను ఒత్తిడిలోకి నెట్టిందని చెప్పాడు. 

ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కూడా పెద్దగా రాణించలేదు. కేవలం శిఖర్ ధావన్ మాత్రమే జట్టు పరువు నిలబెట్టాడు. కోహ్లి గైర్హాజరులో మూడో స్థానంలో అవకాశం దక్కించుకున్న లోకేశ్‌ రాహుల్‌ (15) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (13 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు), రిషభ్‌ పంత్‌ (26 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేదు. కెరీర్‌లో తొలి మ్యాచ్‌ శివమ్‌ దూబే (1)కు కలిసి రాలేదు. కృనాల్‌ పాండ్యా (8 బంతుల్లో 15 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), సుందర్‌ (5 బంతుల్లో 14 నాటౌట్‌; 2 సిక్సర్లు) మెరుపుల కారణంగా చివరి 2 ఓవర్లలో భారత్‌ 30 పరుగులు రాబట్టింది. ఫలితంగా కొంత గౌరవప్రదమైన స్కోరు వద్ద ముగించగలిగింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios