క్యాచ్ పట్టిన తర్వాత బాల్తో సెల్ఫీ... రియాన్ పరాగ్ క్రేజీ క్రియేటివిటీ...
కోల్కత్తా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో బౌండరీ లైన్ దగ్గర రెండు అద్భుతమైన క్యాచ్లు అందుకున్న రియాన్ పరాగ్...
క్యాచ్ పట్టిన తర్వాత బంతితో సెల్ఫీ తీసుకుంటున్నట్టు క్రేజీ సెలబ్రేషన్స్...
ఐపీఎల్ 2020 సీజన్లో వెలుగులోకి వచ్చిన యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ రియాన్ పరాగ్. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాహుల్ తెవాటియాతో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి, రాజస్థాన్కి విజయాన్ని అందించిన రియాన్ పరాగ్, విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత సంప్రదాయ అస్సామీ డ్యాన్స్ ‘బిహు’ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
కోల్కత్తా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో మరోసారి తనలోని క్రియేటివిటీని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాడు రియాన్ పరాగ్. 26 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 36 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి, భారీ షాట్కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర రియాన్ పరాగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
త్రిపాఠి కొట్టిన షాట్ను అద్భుతమైన క్యాచ్గా మలిచిన రియాన్ పరాగ్, అక్కడే ఉన్న రాహుల్ తెవాటియాతో కలిసి బాల్తో సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా ఫోజిచ్చాడు. ఆ తర్వాత ప్యాట్ కమ్మిన్స్ క్యాచ్ అందుకున్న రియాన్ పరాగ్, తన జేబులో ఉన్న మొబైల్ను రాహుల్ తెవాటియాకు అందిస్తున్నట్టుగా సైగ చేశాడు. దాంతో ఈ సారి తెవాటియా బాల్తో సెల్ఫీ తీశాడు.
శిఖర్ ధావన్ తొడ కొట్టడం, రవీంద్ర జడేజా చేతి వేళ్లు చూపించినట్టుగా... రియాన్ పరాగ్ సెల్ఫీ స్టైల్కి కూడా అప్పుడే ఫ్యాన్స్ వచ్చేశారు.