Asianet News TeluguAsianet News Telugu

పేరు మార్చుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్.... 2021 సీజన్‌లో కొత్త పేరు ఏంటంటే...

13 సీజన్లలో టైటిల్ గెలవలేకపోయిన పంజాబ్ జట్టు...

గత సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్...

2014లో ఫైనల్‌కి అర్హత సాధించినా, టైటిల్ గెలవలేకపోయిన ప్రీతి జింటా జట్టు...

Punjab Kings XI name changed before IPL Mini Auction 2021, eleven removed CRA
Author
India, First Published Feb 16, 2021, 12:13 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పేరు మార్చుకుంది. పేరులో ఉన్న ఎలెవన్ కలిసి రావడం లేదనే తలంపుతో, ‘పంజాబ్ కింగ్స్’గా పేరు మార్చుకుంది. గత సీజన్‌లో కెఎల్ రాహుల్ సారథ్యంలో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడిన పంజాబ్, ఆ తర్వాత వరుసగా డబుల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నా ప్లేఆఫ్‌కి అర్హత సాధించడానికి తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడింది. ఆరో స్థానంతో సరిపెట్టుకున్నా, కెప్టెన్ కెఎల్ రాహుల్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టైటిల్, లోగో మార్చిన తర్వాత పర్ఫామెన్స్‌లో అదరగొడుతుండడంతో పంజాబ్ యజమాని కూడా ఆ దిశగా ప్రయత్నిస్తోంది. పంజాబ్ కింగ్స్ కొత్త లోగోను రేపు ఆవిష్కరించబోతున్నారు. మరి ఈ కొత్త పేరు, కొత్త లోగో అయినా సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా టైటిల్ ఆశలు తీరుస్తాయో లేదో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios