MIvsRR: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... పిచ్ మారింది, ముంబై రాత మారుతుందా?
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్, తొలుత బ్యాటింగ్ చేయనున్న రాజస్థాన్ రాయల్స్...
MIvsRR: IPL 2021 సీజన్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్, మంచి విజయంతో కమ్బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్పై విజయంతో మంచి ఉత్సాహంతో ఉంది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో నిన్న జరిగిన మొదటి మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన భారీ టార్గెట్ను సులువుగా చేధించింది సీఎస్కే. దీంతో చెన్నైలో జరిగిన మొదటి ఐదు మ్యాచుల్లో 160+ స్కోరు చేయలేకపోయిన ముంబై ఇండియన్స్, జైట్లీ స్టేడియంలో ఛాంపియన్ రేంజ్లో పర్ఫామెన్స్ చేస్తుందని ఆశిస్తున్నారు క్రికెట్ అభిమానులు...
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబే, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, జయ్దేవ్ ఉనద్కడ్, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహ్మాన్.
ముంబై ఇండియన్స్: డి కాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, పోలార్డ్, కృనాల్ పాండ్యా, నాథన్ కౌంటర్ నీల్, జయంత్ యాదవ్, రాహుల్ చాహార్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్