ధోనీ సిక్స్ కొట్టాడు.. భారత యువతితో పాక్ క్రికెటర్ డేటింగ్ రద్దయ్యింది
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించి.. ప్రపంచంలోని అత్యుత్త కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించి.. ప్రపంచంలోని అత్యుత్త కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి ధోనీ ఓ పాకిస్తాన్ క్రికెటర్ డేటింగ్ రద్దుకు కారణమయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. ధోనీ 2005లో టీమిండియాకు ఎంపిక కావడానికి ముందుకు ఇండియా ఎ జట్టులో ఆడేవాడు. అప్పుడు కెన్యాలో పాకిస్తాన్ -ఏ, భారత్ - ఏ జట్ల మధ్య జరిగిన ట్రై సిరీస్లో రెచ్చిపోయి ఆడి 360 పరుగులు చేశాడు. దాంతో సెలక్టర్ల దృష్టిలో పడి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
అయితే ఆ సిరీస్లోనే పాకిస్తాన్తో ఆడిన ఓ మ్యాచ్లో సిక్సర్ల మోత మోగించాడు. ఆ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న ఓ పాకిస్తాన్ క్రికెటర్... ఆ మ్యాచ్ను వీక్షించడానికి వచ్చిన ఓ భారతీయ యువతిని పరిచయం చేసుకున్నాడు.
మ్యాచ్ అయ్యాకా ఇద్దరు కలిసి రెస్టారెంట్కు కూడా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ధోని కొట్టిన ఓ భారీ సిక్సర్ నేరుగా ఆమెకు తగిలింది. దీంతో గాయపడిన ఆమె ఆసుపత్రి పాలైంది. చివరికి ఆ పాక్ క్రికెటర్ ఆశలు ఆడియాశలయ్యాయి.
ఇది ధోనీ కావాలని చేయకపోయినా.. అనుకోకుండా ఆ యువతికే బంతి తగలడం యాధృచ్చికం. ఈ సిరీస్ తర్వాత భారత జట్టుకు ఎంపికైన మహీ... 2007 నుంచి 2017 వరకు సారథిగా కొనసాగడమే కాకుండా మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఏకైక కెప్టెన్గా చరిత్రకెక్కాడు.