పంజాబ్ కింగ్స్ తో మంగళవారం రాజస్థాన్ జట్టు తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో చేతన్ తన బ్రిలియంట్ బౌలింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. నిన్నటి మ్యాచ్ లో 3 వికెట్లు తీశాడు. అంతేకాదు.. 31 పరుగులు కూడా తీశాడు.

ప్రస్తుతం ఎక్కడ విన్నా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు చేతన్ సకారియా పేరే వినపడుతోంది. ఒకప్పుడు కనీసం కాళ్లకు వేసుకోవడానికి బూట్లు కూడా లేని కుర్రాడు.. నిన్నటి మ్యాచ్ లో చెలరేగిపోయాడు. అతనే చేతన్ సకారియా. ఐపీఎల్ లో అతనిని ఈ ఏడాది రాజస్థాన్ జట్టు 1.2కోట్లు ఖర్చు పెట్టి మరీ కొనుగోలు చేసింది. కాగా.. అరంగేట్రంలోనే సకారియా అదరగొట్టాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పంజాబ్ కింగ్స్ తో మంగళవారం రాజస్థాన్ జట్టు తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో చేతన్ తన బ్రిలియంట్ బౌలింగ్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. నిన్నటి మ్యాచ్ లో 3 వికెట్లు తీశాడు. అంతేకాదు.. 31 పరుగులు కూడా తీశాడు.

Scroll to load tweet…

కాగా.. ఈ నేపథ్యంలో.. సకారియాపై ఇండియన్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా.. సకారియా జీవితంలో జరిగిన ఓ ట్రాజెడీని కూడా తెలియజేశాడు. 

‘‘ఐపీఎల్ 14 సీజన్ ప్రారంభం కావడానికి ముందే.. చేతన్ సకారియా సోదరుడు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. అతను చనిపోయిన 10 రోజుల వరకు ఆ విషయాన్ని అతని తల్లిదండ్రులు చేతన్ కి చెప్పలేదట. అప్పుడు చేతన్ ఎస్ఎంఏ ట్రోఫీ ఆడుతున్నాడు. ఐపీఎల్ నిజంగా.. ఇండియన్ యువ క్రికెటర్ల కలను నెరవేరుస్తుంది’’ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.