Asianet News TeluguAsianet News Telugu

ఏంటీ సామీ ఈ ఆట.. మ్యాక్స్ వెల్ ని ఏకిపారేస్తున్న నెటిజన్లు

9 మ్యాచ్‌లలో మ్యాక్సీ 58 పరుగులు మాత్రమే చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బౌలింగ్‌లో ఫరవాలేదనిపిస్తున్న ఈ ఆల్‌రౌండర్‌ బ్యాటింగ్‌లో ఇంత దారుణంగా విఫలమవడం జట్టును కష్టాల్లోకి నెడుతుందని అంటున్నారు.
 

IPL 2020 MI vs KXIP: Glenn Maxwell brutally trolled on Twitter after his another failure
Author
Hyderabad, First Published Oct 19, 2020, 3:05 PM IST

ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో సగానికి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. అయితే.. ఈ సీజన్ లో పంజాబ్ తన సత్తా పెద్దగా చాటలేకపోయింది. మొత్తం తొమ్మిది మ్యాచులు ఆడగా.. కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే గెలిచింది. మరీ ముఖ్యంగా ఆ జట్టు సీనియర్ ఆటగాడు గ్లేన్ మ్యాక్స్ వెల్ మాత్రం తీవ్ర నిరాశగా పరిచాడు.

దీంతొ.. అతని ఆటపై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. 9 మ్యాచ్‌లలో మ్యాక్సీ 58 పరుగులు మాత్రమే చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బౌలింగ్‌లో ఫరవాలేదనిపిస్తున్న ఈ ఆల్‌రౌండర్‌ బ్యాటింగ్‌లో ఇంత దారుణంగా విఫలమవడం జట్టును కష్టాల్లోకి నెడుతుందని అంటున్నారు.

నిన్న ముంబైతో మ్యాచ్‌లోనూ రాహుల్‌ చహర్‌ బౌలింగ్‌లో పరుగులేమీ చేయకుండానే మ్యాక్సీ వెనుదిరడంతో భారమంతా కెప్టెన్‌ రాహుల్‌పై పడింది. పంజాబ్‌ కూడా సరిగ్గా 176 పరుగులే చేయడంతో మ్యాచ్‌ టై గా ముగిసిన సంగతి తెలిసిందే. 

తొలుత జరిగిన సూపర్‌ ఓవర్‌ కూడా టై కావడంతో.. రెండో సూపర్‌ ఓవర్‌లో పంజాబ్‌ విజయం సాధించింది. కేఎల్‌ రాహుల్‌కు మిగతా బ్యాట్స్‌మెన్‌ సహకారం ఉండి ఉంటే పంజాబ్‌ అలవోక విజయం సాధించేది. ఈనేపథ్యంలో ‘11 కోట్లు పెట్టి చీర్‌ లీడర్‌ని కొన్నట్టుగా మ్యాక్స్‌వెల్‌ ఆటతీరు ఉంది’ అని కొందరు, ‘డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోచ్‌ కుంట్లే రెడీగా ఉన్నాడు. నీకు మామూలుగా ఉండదు’అని మరికొందరు అభిమానులు మీమ్స్‌తో మ్యాక్సీని ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా, గత కొన్ని సీజన్లలోనూ పెద్దగా రాణించని మ్యాక్సీని పంజాబ్‌ ఫ్రాంచైజీ ఐపీఎల్‌ 2020 సీజన్‌లో రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అంత మొత్తం పెట్టి కొనుగోలు చేసిన వ్యక్తి ఇంత ఘోరంగా విఫలమవ్వడంతో ట్రోల్ చేస్తున్నారు.. ఏంది స్వామీ ఈ ఆట అంటూ పంజాబ్ అభిమానులు కూడా నెత్తి కొట్టుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios