టీ20 వరల్డ్కప్ షెడ్యూల్ విడుదల: తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ
మరో క్రికెట్ సంగ్రామానికి తెరలేచింది. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్కప్ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది.
మరో క్రికెట్ సంగ్రామానికి తెరలేచింది. క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్కప్ షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఈ ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 16 దేశాలు ఈ మెగా టోర్నమెంట్లో తలపడతాయి.
పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ వంటి పసికూనలు ఈ సారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ టోర్నమెంట్లో చిన్న జట్లు ఎక్కువగా ఉండటంతో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి షెడ్యూల్ను వినూత్నంగా రూపొందించింది.
పసికూనలను ఏ, బీ అనే రెండు గ్రూపులుగా విడదీసి.. అందులో రెండు పెద్ద జట్లను వేసింది. గ్రూప్-ఏలో శ్రీలంక, పపువా న్యూగినియా, ఐర్లాండ్, ఒమన్ ఉన్నాయి. ఇక గ్రూప్-బీలో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్ ఉంటాయి. ఈ రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి.
ఇక సూపర్-12 దశలో జట్లను గ్రూప్-1, గ్రూప్-2గా విభజించారు. గ్రూప్-1లో పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్.. గ్రూప్-2లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ ఉన్నాయి.
గ్రూప్-ఏలో తొలిస్థానం సాధించిన జట్టు, గ్రూప్-బిలో రెండోస్థానంలోని జట్టు సూపర్-12లో గ్రూప్-1లో చేరతాయి. అలాగే గ్రూప్-బిలో అగ్రస్థానం సాధించిన జట్టు, గ్రూప్-ఏలో రెండో జట్టు సూపర్-12లో గ్రూప్-2లోకి చేరతాయి.
ఈ టోర్నమెంట్లో తొలి మ్యాచ్ శ్రీలంక-ఐర్లాండ్ మధ్య అక్టోబర్ 18న జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా నవంబర్ 15న జరగనుంది. ఇక భారత్ విషయానికి వస్తే సూపర్-12లో టీమిండియా ఐదు మ్యాచ్ల్లో తలపడుతుంది.
టీమిండియా షెడ్యూల్:
* 24.10.2020 భారత్-దక్షిఫణాఫ్రికా
* 29.10.2020 భారత్ -క్వాలిఫైయర్ జట్టు
* 01.11.2020 భారత్- ఇంగ్లాండ్
* 05.11.2020 భారత్- క్వాలిఫైయర్ జట్టు
* 08.11.2020 భారత్-ఆఫ్గానిస్తాన్