'అతడే కెప్టెన్గా ఉండాలి..' టీమిండియా కెప్టెన్సీ పై గంభీర్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్న తరుణంలో టీమిండియా కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
![Gautam Gambhir picks Rohit Sharma over Hardik Pandya for T20 World Cup 2024 captaincy KRJ Gautam Gambhir picks Rohit Sharma over Hardik Pandya for T20 World Cup 2024 captaincy KRJ](https://static-ai.asianetnews.com/images/01h9ch47c4zf6vv465nyd4qr9t/gambhir_363x203xt.jpg)
వన్డే ప్రపంచకప్ 2023లో ఓటమి తర్వాత వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ను గెలుచుకోవాలని టీమిండియా కన్నేసింది. ఈ టోర్నమెంట్ జూన్ 2024లో నిర్వహించబడుతుంది. అయితే.. ఈ టోర్నీకి చాలా మంది సీనియర్ భారత ఆటగాళ్లు దూరంగా ఉండవచ్చని చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలోనే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీ 20 టోర్నీలో రోహిత్, విరాట్ కోహ్లి ఆడాలని అంటున్నారు. ఆ టోర్నీకి రోహిత్ శర్మనే కెప్టెన్సీ చేయాలని అభిప్రాయపడ్డారు.
వాస్తవానికి 2022 టీ20 ప్రపంచకప్లో రోహిత్ టీమ్ ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ టోర్నీ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత నుంచి రోహిత్ శర్మ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అతని గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా, ఇతర ఆటగాళ్లు జట్టు బాధ్యతలు చేపట్టారు. కాగా, వన్డే ప్రపంచకప్లో రోహిత్ నేతృత్వంలో భారత్ ఫైనల్ చేరింది. అక్కడ ఆస్ట్రేలియాతో జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరూ ఆడాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు.
గంభీర్ ఏం చెప్పాడు?
గత ఏడాది కాలంగా టీ20లో హార్దిక్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ, టీ20 ప్రపంచకప్లో రోహిత్ బాధ్యతలు చేపట్టాలని గంభీర్ అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్కు రోహిత్, కోహ్లీ ఇద్దరినీ జట్టులో ఎంపిక చేయాలని గంభీర్ అన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘కోహ్లీ, రోహిత్లను ఎంపిక చేయాలి. మరీ ముఖ్యంగా టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మను కెప్టెన్గా చూడాలనుకుంటున్నాను. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా T20 లో కెప్టెన్గా ఉన్నాడు. కానీ T20 ప్రపంచ కప్లో రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండడాన్ని నేను ఇంకా చూడాలనుకుంటున్నానని అన్నారు.
గంభీర్ ఇంకా మాట్లాడుతూ, “ఈ ప్రపంచకప్లో రోహిత్ , కోహ్లీ తమ బ్యాటింగ్తో దీనిని చూపించారు. రోహిత్ శర్మను ఎంపిక చేస్తే, విరాట్ కోహ్లీ ఆటోమేటిక్గా ఎంపికయ్యాడు. రోహిత్ టీ20 వరల్డ్ కప్ ఆడాలని నిర్ణయించుకుంటే.. బ్యాట్స్ మెన్ గానే కాకుండా కెప్టెన్ గా ఎంపికవ్వాలి.ఆస్ట్రేలియాతో గురువారం (నవంబర్ 23న ప్రారంభం కానున్న టీ20 సిరీస్ ను బీసీసీఐ ప్రకటించింది.భారత్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ నియమితులయ్యారు.
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో సూర్యకుమార్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గాయం కారణంగా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. తొలి మూడు టీ20లకు రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్గా ఉండగా సూర్యకుమార్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గైక్వాడ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ చివరి రెండు మ్యాచ్ల్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.