ENG vs IND T20I: ఎడ్జబాస్టన్ టెస్టులో ఓటమి పాలై నిరాశలో ఉన్న భారత జట్టు ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ వేదికగా దొరికింది. సౌతాంప్టన్ వేదికగా నేడు ఇండియా-ఇంగ్లాండ్ మధ్య తొలి టీ20 జరగనుంది. 

భారత్-ఇంగ్లాండ్ మధ్య సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టెస్టు సిరీస్ ను 2-2తో డ్రా చేసుకున్న టీమిండియా.. టీ20లలో గెలిచి దానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. ఆ మేరకు టీమిండియాకు ఇది తొలి అవకాశం. ఎడ్జబాస్టన్ టెస్టులో కరోనా కారణంగా ఆడలేకపోయిన టీమిండియా సారథి రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నాడు. 

ఇక దాదాపు ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్ లోనూ ఆడిస్తున్నారు. కానీ వీరికి రోహిత్ శర్మ యాడ్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా తరఫున అర్ష్దీప్ సింగ్ అరంగేట్రం చేస్తున్నాడు. కానీ సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లను పక్కనబెట్టింది టీమ్ మేనేజ్మెంట్. 

Scroll to load tweet…

జట్లు : 

ఇండియా : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ 

ఇంగ్లాండ్ : జోస్ బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, డేవిడ్ మలన్, మోయిన్ అలీ, లియామ్ లివింగ్ స్టోన్, హారీ బ్రూక్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టోప్లే, మాథ్యూ పార్కిన్సన్