Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. ఒకే ఆస్పత్రిలో 3 డాక్టర్లు, 26మంది నర్సులకు కరోనా

తాజాగా ముంబయి నగరానికి చెందిన ఓ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు, నర్సులకు వైరస్ సోకిందంటూ వార్తలు వస్తున్నాయి. 

Mumbai's Wockhardt Hospital Shuts, 26 Nurses, 3 Doctors Test COVID-19 +ve
Author
Hyderabad, First Published Apr 6, 2020, 2:31 PM IST

క‌రోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మరి.. భారత్ లోనూ విషం చిమ్ముతోంది. తొలుత పదుల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు ఆ త‌ర్వాత ఢిల్లీ మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వారు, వారి బంధువులు-కుటుంబ స‌భ్యులకు పాకి వేల సంఖ్యలో కి చేరింది. తెలుగు రాష్ట్ర్టాల్లోనూ దీని ప్రభంజనం రోజురోజుకీ పెరిగిపోతోంది.

కాగా... తాజాగా ముంబయి నగరానికి చెందిన ఓ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లకు, నర్సులకు వైరస్ సోకిందంటూ వార్తలు వస్తున్నాయి. 

Also Read బెడ్ షీట్ చుట్టుకుని ఆస్పత్రి ఆరో అంతస్థు నుంచి పరారీకి యత్నించి మృతి...

ముంబై కార్పోరేష‌న్ ప‌రిధిలోని వోక్ హార్డ్ ఆసుప‌త్రిలో ముగ్గురు వైద్యులు, 26మంది న‌ర్సుల‌కు క‌రోనా పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్ర‌క‌టించి, వ్యాధి ఇత‌ర రోగుల‌కు, వైద్య చసిబ్బందికి సోక‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

అయితే, క‌రోనా ఆ ప్రైవేటు వైద్య సిబ్బందికి ఎలా వ‌చ్చింద‌ని ఆరా తీయ‌గా… క‌రోనా వైర‌స్ ఉన్న ఓ 70 ఏళ్ల వ్య‌క్తి మార్చి 27న‌ హార్ట్ ఎటాక్ తో ఆసుప‌త్రిలో ఎమ‌ర్జెన్సీలో జాయిన్ అయ్యాడు. దీంతో ఆయ‌న‌కు తొలుత వైద్య స‌హాయం చేసిన ఇద్ద‌రు న‌ర్సుల‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు నిర్థారణ అయ్యింది. 

దీంతో వ్యాధి క్ర‌మంగా 26 మంది న‌ర్సుల‌కు, 3 వైద్యుల‌కు సోకిన‌ట్లు తేలింది. వ్యాధి ఇంతలా వ్యాప్తి చెంద‌టంలో ఆసుప‌త్రి నిర్వాకం కూడా ఉంద‌ని… మొద‌ట్లోనే వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న న‌ర్సుల‌ను క్వారెంటైన్ చేయ‌కుండా డ్యూటీలు వేయ‌టంతో వైర‌స్ వ్యాపించింద‌న్న ఆరోప‌ణ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే దీన్ని ఆసుప‌త్రి వ‌ర్గాలు మాత్రం ఖండిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios