Asianet News TeluguAsianet News Telugu

సీఎం ఇంటి చుట్టూ తిరిగిన కరోనా రోగులు: తీవ్ర ఆందోళన

కర్ణాటక సీఎం యడియూరప్ప ఇంటి చుట్టూ ఇద్దరు కరోనా వైరస్ రోగులు సంచరించినట్టులు అధికారులు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకోవడానికి అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Coronavirus patients walked arounf Karnataka CM residence
Author
Bengaluru, First Published Mar 30, 2020, 7:47 AM IST

బెంగళూరు: కరోనా వైరస్ లక్షణాలు ఉన్న ఇద్దరు వ్యక్తులు బెంగళూరులోని డాలర్స్ కాలనీలో గల ముఖ్యమంత్రి యడియూరప్ప ఇంటి చుట్టుపక్కల తిరిగినట్లు అనుమానిస్తున్నారు. శనివారంనాడు కరోనా వైరస్ లక్షణాలున్న జాబితాను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసింది. 

జాబితాలో ఏ -59, ఏ-25 నంబర్ కలిగిన వ్యక్తులు ముఖ్మయంత్రి నివాసం చుట్టూ తిరిగారని తెలుస్తోంది. ఇది తీవ్ర ఆందోళనకు కారణమైంది. విదేశాల నుంచి వచ్చిన ఏ-25 రోగితో పాటు వారి ఇంటిలో పనిచేస్తున్న మహిళ (ఏ-59)కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.

ముఖ్యమంత్రి నివాసం చుట్టూ తిరిగిన ఇద్దరు రోగులు ఓ ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్స పొందుతున్నారు. వారిద్దరు డాలర్స్ కాలనీలో ఉన్న యడియూరప్ప ఇంటి చుట్టూ తిరిగినట్లు బీబీఎంపీ జాయింట్ కమిషర్ పల్లవి, బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీ శశికుమార్ పరిశీలించారు.

ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన ఓ మహిళ ప్రతి రోజు నాలుగు ఇళ్లలో పాచీపనులు చేస్తుంది. వారి ఇళ్ల ముందు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వారిని బయటకు పంపించడం లేదని పోలీసులు అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios