Asianet News TeluguAsianet News Telugu

Union Budget 2024-25 ట్యాక్స్ పేయర్స్ కు రూ.17వేలు ఆదా...ఎలాగో తెలుసా? 

ఆల్పాదాయ వర్గాలకు ఆదాయ పన్నునుండి కొంత మినహాయింపు ఇచ్చింది తాజా బడ్జెట్ 2024-25. అదేంటో తెలుసా..? 

Union Budget 2024-25: Key Changes in Personal Income Tax Slabs AKP
Author
First Published Jul 23, 2024, 1:11 PM IST | Last Updated Jul 23, 2024, 1:11 PM IST

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2024-24 లో వ్యక్తిగత పన్నుల విధానంలో మార్పులు చేపట్టింది. 3 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయ పన్ను విధించడంలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.  అయితే ఏడాదికి రూ.3-7 లక్షల లోపు ఆదాయం కలిగినివారికి 5 శాతం, రూ.7‌‌-10 లక్షలలోపు ఆదాయం కలిగిన వారికి 10 శాతం పన్ను  విధించనున్నారు.   

పది లక్షలకు పైగా ఆదాయం కలిగినవారికి పన్నులభారం ఎక్కువగానే వుండనుంది. రూ.10-12 లక్షలలోపు ఆదాయముంటే 15 శాతం, రూ.12-15 లక్షల ఆదాయం కలిగినవారికి 20 శాతం, రూ.15 లక్షలకు పైగా ఆదాయం వుంటే రూ.30 శాతం పన్ను విధించనున్నారు. ఇలా వ్యక్తిగత పన్నుల విధానంలో మార్పులు చేసింది ప్రభుత్వం. 

ఆదాయ పన్నులో కేంద్ర ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. గతంలో 3-6 లక్షల వరకు 5 శాతం ట్యాక్స్ వుంటే దాన్ని 3-7 లక్షలకు పెంచింది. అలాగే గతంలో 6-9 లక్షలకు 10 శాతం వుంటే తాజాగా 7-10 లక్షలకు పెంచారు. ఇక 10 లక్షలకు పైగా ఆదాయం కలిగినవారికి ట్యాక్సులు యధావిధిగానే వున్నారు. ఇలా స్వల్పధాయ వర్గాల్ల ట్యాక్సుల మార్పు వల్ల రూ.17 వేల వరకు లబ్ది చేకూరే అవకాశాలున్నాయి. అల్పాధాయ వర్గాలకు లబ్ది చేకూర్చేందుకే కేంద్రం ఈ పన్నుల విధానంలో మార్పులు చేపట్టింది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios