సారాంశం

అతి త్వరలోనే ట్విట్టర్‌ ద్వారా ఎవరితోనైనా వాయిస్ కాల్స్, వీడియో చాట్‌లు ఉంటాయని ఎలాన్ మస్క్ తెలిపారు. మీ నంబర్ ఇవ్వకుండానే ప్రపంచంలో ఎక్కడైనా వ్యక్తులతో మాట్లాడగలరు. ట్విట్టర్ కాల్ ఫీచర్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ వంటి మెటా సోషల్ మీడియా అప్లికేషన్‌లకు పోటీగా ఈ ఫీచర్ రానుంది. 

మైక్రో-బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, కొత్త కొత్త ఫీచర్లతో అప్ డేట్స్ పొందుతోంది. తరచుగా దాని ఫీచర్లలో కొన్ని లేదా ఇతర మార్పుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.  ఇప్పుడు దీనికి సంబంధించి మరో పెద్ద ప్రకటన ట్విట్టర్ యూజర్లలో ఆనందాన్ని నింపుతోంది.  రాబోయే కాలంలో ట్విట్టర్‌ యూజర్లు కూడా ఒకరికొకరు కాల్ చేసుకోవచ్చని ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ తెలిపారు. ఇది మాత్రమే కాదు, మస్క్ త్వరలో ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్‌తో సహా అనేక కొత్త ఫీచర్లను జోడించబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఫీచర్ డబ్బు చెల్లించే యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. కాగా  దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్‌డేట్ విడుదల కాలేదు.

గత సంవత్సరం, మస్క్ "ట్విట్టర్ 2.0 ది ఎవ్రీథింగ్ యాప్" కోసం ప్లాన్‌లను ఫ్లాగ్ చేశాడు, ఇందులో ఎన్‌క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్‌లు (DMలు), లాంగ్‌ఫార్మ్ ట్వీట్లు, పేమెంట్స్ వంటి ఫీచర్లు ఉంటాయని చెప్పారు. మస్క్ మంగళవారం ఒక ట్వీట్‌లో, "త్వరలో ఈ ప్లాట్‌ఫారమ్ మీ హ్యాండిల్‌తో వాయిస్, వీడియో చాట్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కాబట్టి మీరు మీ ఫోన్ నంబర్ ఇవ్వకుండానే ప్రపంచంలో ఎక్కడైనా వ్యక్తులతో మాట్లాడవచ్చు."

ట్విట్టర్‌లోని కాల్ ఫీచర్ మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ను మెటా, సోషల్ మీడియా అప్లికేషన్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో సమానంగా మార్కెట్‌లో ఉంచుతుంది. అయితే, ఈ ఫీచర్ ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. 

బుధవారం నుండి ట్విట్టర్‌లో ఎన్‌క్రిప్టెడ్ డైరెక్ట్ మెసేజ్‌ల ఎంపిక అందుబాటులో ఉంటుందని మస్క్ చెప్పారు, అయితే కాల్‌లు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయో లేదో చెప్పలేదు. విశేషమేమిటంటే, మస్క్ ట్విట్టర్‌లో నిరంతరం మార్పులు చేస్తూ ఉంటాడు, గతంలో డబ్బు చెల్లించని వారి బ్లూ టిక్‌ను తొలగించాడు. ఆ నిర్ణయం తర్వాత చాలా మంది పెద్ద వ్యక్తులు ట్విట్టర్‌ను విడిచిపెట్టినట్లు సమాచారం.