Asianet News TeluguAsianet News Telugu

బంగారానికి భలే డిమాండ్.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరింత పైకి..

కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల భయము కూడా పెరుగుతోంది. సోమవారం, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఔన్సుకు రూ.1945.26 గా నమోదయ్యాయి. భారతదేశంలో కూడా, స్పాట్ బంగారం ధరలు 10 గ్రాములకి రూ.52260 చేరుకున్నాయి. 

todays gold price:Gold prices hit new record high  in this season
Author
Hyderabad, First Published Jul 28, 2020, 11:09 AM IST

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన యుఎస్, చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామాలను కొనుగోలు చేయడంతో బంగారం ధరల పెరుగుదల కొనసాగాయి.

కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల భయము కూడా పెరుగుతోంది. సోమవారం, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఔన్సుకు రూ.1945.26 గా నమోదయ్యాయి. భారతదేశంలో కూడా, స్పాట్ బంగారం ధరలు 10 గ్రాములకి రూ.52260 చేరుకున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు ప్రవేశపెట్టిన భారీ ఉద్దీపన చర్యలు గత కొన్ని నెలలుగా బంగారం ధరలను అధికంగా పెంచుతున్నాయి. హ్యూస్టన్, చెంగ్డులోని రాయబార కార్యాలయాలను బలవంతంగా మూసివేయడంతో యుఎస్, చైనా మధ్య ఉద్రిక్తత తీవ్రమైంది. 


 ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.905 ఎగబాకి రూ.53 వేలకు చేరువైంది. బంగారంతో పాటు వెండి కూడా భారీగా పుంజుకుంటున్నది.

also read అమెజాన్ బంపర్‌ ఆఫర్‌... త్వరలో వెయ్యి ఉద్యోగాలు.. ...

పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి ఏకంగా రూ.3,347 ఎగబాకి రూ.65,670కి చేరుకున్నది. గతంలో రూ.62,323గా ఉన్నది. గడిచిన పది రోజుల్లో వెండి రూ.12 వేలకు పైగా పెరిగింది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ.820 పెరిగి రూ.54,300 పలుకగా, 22 క్యారెట్ల ధర రూ.49,730కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,935 డాలర్లకు చేరుకోగా, వెండి 24 డాలర్లుగా నమోదైంది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ దీపక్‌ తెలిపారు. వీటన్నిటికి తోడు శ్రావణ మాసం పెళ్లిల్ల సీజన్ కావడంతో బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios