Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ పతనం.. 283 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, 19000 దిగువన నిఫ్టీ...

నేడు బుధవారం సెన్సెక్స్ 283.60 (0.44%) పాయింట్లు పడిపోయి 63,591.33 వద్ద, నిఫ్టీ 90.45 (0.47%) పాయింట్లు పడిపోయి 18,989.15 వద్ద ముగిసింది. ఐటీ, మెటల్, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్ల నుంచి మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది.
 

Stock market closed with decline, Sensex fell by 283 points, Nifty below 19000-sak
Author
First Published Nov 1, 2023, 5:06 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిసింది. బుధవారం సెన్సెక్స్ 283.60 (0.44%) పాయింట్లు పడిపోయి 63,591.33 వద్ద ముగియగా, నిఫ్టీ 90.45 (0.47%) పాయింట్లు పడిపోయి 18,989.15 వద్ద ముగిసింది. ఐటీ, మెటల్, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్ల నుంచి మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. మరోవైపు మీడియా, ఫార్మా, ప్రభుత్వ బ్యాంకింగ్, రియల్టీ రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. మంగళవారం ప్రారంభంలో, BSE సెన్సెక్స్ 237 పాయింట్లు బలహీనపడింది అండ్  63,874 స్థాయి వద్ద ముగిసింది.

భారతీయ కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ మార్కెట్లలో
కొన్ని షరతులతో భారతీయ కంపెనీలు నేరుగా విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కంపెనీ చట్టం కింద సంబంధిత సెక్షన్లను నోటిఫై చేసింది. నిబంధనలను ఇంకా తెలియజేయాల్సి ఉంది. ప్రస్తుతం, స్థానిక కంపెనీలు అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్ (ADR), గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్ (GDR) ద్వారా విదేశాలలో లిస్ట్  చేయబడుతున్నాయి. హాంకాంగ్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్‌లోని ఇతర ప్రముఖ  ఎక్స్ఛేంజీలతో సహా పలు దేశాల్లో బలమైన మనీలాండరింగ్ నిబంధనలతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌ను అనుమతించాలని సెబీ ప్రతిపాదించింది.

Follow Us:
Download App:
  • android
  • ios