Asianet News TeluguAsianet News Telugu

పండుగ వేళ దిగోస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు 10 గ్రా, ధర ఎంతంటే ?

ముందురోజు  బంగారం ధర 0.76 శాతం, అంటే 10 గ్రాములకు రూ.380, వెండి 0.28 శాతం పెరిగింది. భారతదేశంలో ఈ వారం ధంతేరాస్, దీపావళి పండుగ సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

silver and gold price today : 13 november 2020 latest price gold in mcx struggle silver rates drop
Author
Hyderabad, First Published Nov 13, 2020, 1:55 PM IST

 నేడు భారతదేశంలో బంగారం ధరలు కాస్త దిగోచ్చాయి. ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల బంగారం ధర 0.07 శాతం పెరిగి రూ .50,635 కు చేరుకోగా, వెండి ధర 0.2 శాతం తగ్గి కిలోకు 62,615 రూపాయలకు చేరుకుంది.

ముందురోజు  బంగారం ధర 0.76 శాతం, అంటే 10 గ్రాములకు రూ.380, వెండి 0.28 శాతం పెరిగింది. భారతదేశంలో ఈ వారం ధంతేరాస్, దీపావళి పండుగ సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగస్టులో రికార్డు స్థాయిలో రూ.56వేలకు చేరిన బంగారం ధర ప్రస్తుతం గణనీయంగా మెరుగుపడింది.

పండుగల సందర్భంగా అమ్మకాల మెరుగుదల
ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం మాట్లాడుతూ, 'ఫుట్‌ఫాల్స్ మెరుగ్గా ఉన్నాయి, ప్రజలు కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. అమ్మకాలు కూడా మెరుగుపడుతున్నాయి, కానీ గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు అంతగా లేవు.

also read రెడ్ మార్క్ మీద ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 250 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్.. ...

ఆభరణాల మార్కెట్ నెమ్మదిగా కోలుకుంటుందని, వినియోగదారుల సెంటిమెంట్ సానుకూలంగా ఉందని, ఈ సంవత్సరంలో ధంతేరాస్, దీపావళి పండుగ రెండు రోజులు జరుపుకుంటారు. నవంబర్ 13న దేశవ్యాప్తంగా గరిష్ట లావాదేవీలను మేము ఆశిస్తున్నాము అని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత్ పద్మనాభన్ అన్నారు.  

నేడు, ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, కాబట్టి తాజా ఆంక్షలు ఆర్థిక కార్యకలాపాలను  కాస్త ప్రభావితం చేస్తాయి.

స్పాట్ బంగారం ఔన్సుకు 1,876.92 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది, ఈ వారంలో 3.8 శాతం తగ్గింది. ఇతర విలువైన లోహాలలో వెండి 0.1 శాతం పెరిగి ఔన్సు 24.26 డాలర్లకు చేరుకోగా, ప్లాటినం స్థిరంగా 879.26 డాలర్లకు చేరుకుంది.

ధంతేరాస్ మరియు దీపావళి సందర్భంగా బంగారం కొనడం చాలా పవిత్రంగా భావిస్తారు. ప్రభుత్వం నవంబర్ 9 నుండి ఎనిమిదవ సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ గోల్డ్ బాండ్‌ స్కీం కోసం ఈ రోజు వరకు అంటే నవంబర్ 13 వరకు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు.  

Follow Us:
Download App:
  • android
  • ios