Asianet News TeluguAsianet News Telugu

రెడ్ మార్క్ మీద ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. 250 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్..

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  సెన్సెక్స్ ఇండెక్స్ 257.28 పాయింట్లు (0.59 శాతం) 43099.91 వద్ద ప్రారంభమైంది.  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 69.40 పాయింట్లు (0.55 శాతం) క్షీణించి 12621.40 వద్ద ప్రారంభమైంది.

sharemarket update : bse sensex nse nifty share market today on friday opening in red mark
Author
Hyderabad, First Published Nov 13, 2020, 10:54 AM IST

ఈ వారం  స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ రోజున, అంటే శుక్రవారం స్టాక్ మార్కెట్ రెడ్ మార్క్ మీద ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  సెన్సెక్స్ ఇండెక్స్ 257.28 పాయింట్లు (0.59 శాతం) 43099.91 వద్ద ప్రారంభమైంది.  

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 69.40 పాయింట్లు (0.55 శాతం) క్షీణించి 12621.40 వద్ద ప్రారంభమైంది.  అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్ అస్థిరత మరింత కొనసాగుతుంది. అందువల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు.   

నేడు టైటాన్, ఇట్చర్ మోటార్స్, డాక్ రెడ్డి, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, హిందుస్తాన్ యూనివర్, గ్రాసిమ్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్  షేర్లు వేగంగా ప్రారంభమయ్యాయి. ఎల్ అండ్ టి, ఎస్‌బి‌ఐ, హిండాల్కో, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్‌డి‌ఎఫ్‌సి, యాక్సిస్ బ్యాంక్ షేర్లు రెడ్ మార్క్ మీద ప్రారంభమయ్యాయి.

also read మరో ఉద్దీపనప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. విలేకరుల సమావేశంలో ఆర్ధిక మంత్రి ఏమన్నారంటే ? ...

రియాల్టీ, ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసిజి కాకుండా, మిగతా అన్ని రంగాలు రెడ్ మార్క్ మీద ఓపెన్ అయ్యాయి. వీటిలో ఫైనాన్స్ సర్వీసెస్, బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, పిఎస్‌యు బ్యాంకులు, ఐటి ఉన్నాయి.

స్టాక్ మార్కెట్  ప్రీ-ఓపెన్ సమయంలో ఉదయం 9.02 గంటలకు 95.12 పాయింట్లు అంటే 0.22 శాతం పడిపోయిన తరువాత  సెన్సెక్స్  43262.07 స్థాయిలో ఉంది. నిఫ్టీ 40.40 పాయింట్లు అంటే 0.32 శాతం తగ్గి 12650.40 వద్ద ఉంది.

 స్టాక్ మార్కెట్ మునుపటి ట్రేడింగ్ రోజున రెడ్ మార్కుతో ముగిసింది . సెన్సెక్స్ 236.48 పాయింట్లు అంటే 0.54 శాతం పడిపోయి 43,357.19 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 58.35 పాయింట్లు అంటే 0.46 శాతం పడిపోయి 12,690.80 వద్ద ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios