Asianet News TeluguAsianet News Telugu

బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక, మరో రెండు బ్యాంకుల లైసెన్స్‌ను రద్దు చేసిన ఆర్‌బిఐ..

ఆర్‌బిఐ మహారాష్ట్రలోని బ్యాంకుల లైసెన్స్‌లను రద్దు చేసింది, అందులో ఒకటి కొల్హాపూర్‌లోని సుభద్ర లోకల్ ఏరియా బ్యాంక్. అయితే బ్యాంకింగ్ రంగ రెగ్యులేటరి ఈ బ్యాంక్ పనిచేస్తున్న విధానం ప్రస్తుత, భవిష్యత్ డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని, అది ఈ నిర్ణయానికి దారితీసిందని తెలిపింది. 
 

reserve bank of india cancels license of subhadra local area bank and karad bank in maharashtra
Author
Hyderabad, First Published Dec 25, 2020, 1:56 PM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మహారాష్ట్రలోని బ్యాంకుల లైసెన్స్‌లను రద్దు చేసింది, అందులో ఒకటి కొల్హాపూర్‌లోని సుభద్ర లోకల్ ఏరియా బ్యాంక్. అయితే బ్యాంకింగ్ రంగ రెగ్యులేటరి ఈ బ్యాంక్ పనిచేస్తున్న విధానం ప్రస్తుత, భవిష్యత్ డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని, అది ఈ నిర్ణయానికి దారితీసిందని తెలిపింది. 

 ఈ నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలోని రెండు త్రైమాసికాలలో బ్యాంక్ కనీస నెట్‌వర్త్ షరతును ఉల్లంఘించిందని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే సుభద్ర లోకల్ ఏరియా బ్యాంక్ డిపాజిటర్ల డబ్బును తిరిగి ఇవ్వడానికి తగినంత నగదును కలిగి ఉంది.

సెంట్రల్ బ్యాంక్ ఇంకా మాట్లాడుతూ "బ్యాంక్ వ్యవహరించే విధానం, అలాగే ఇదే పద్ధతిలో పనిచేయడానికి అనుమతించినట్లయితే, ప్రజా ప్రయోజనాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. ప్రస్తుత, భవిష్యత్తులో డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగిస్తుంది.

24 డిసెంబర్ 2020న బ్యాంక్ వ్యాపారం ముగిసినప్పటి నుండి సుభద్ర లోకల్ ఏరియా బ్యాంకుకు ఇచ్చిన లైసెన్స్ రద్దు చేయబడుతోంది. 

also read కరోనా వైరస్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రభావితమైందో, చర్యలు ఎంటో తెలుసుకోండి.. ...

బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 ప్రకారం వెంటనే అమలులోకి వస్తుంది. ఇది బ్యాంకింగ్ కార్యకలాపాలు చేయకుండా నిరోధిస్తుంది. అలాగే బ్యాంకు లిక్విడేషన్ కోసం ఆర్‌బిఐ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది.

మహారాష్ట్రకు చెందిన ది కరాద్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను కూడా రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. తగినంత మూలధనం, సంపాదించే సామర్థ్యం లేకపోవడం కారణంగా ఈ చర్య తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

బ్యాంక్ డిపాజిటర్లలో 99 శాతానికి పైగా డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుండి పూర్తి చెల్లింపును పొందుతారని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. లైసెన్స్ రద్దు, లిక్విడేషన్ చర్యలను ప్రారంభించడంతో ది కరాడ్ జనతా సహకారి బ్యాంక్ డిపాజిటర్లకు చెల్లింపు ప్రక్రియ ప్రారంభించబడుతుంది. 

లిక్విడేషన్ ప్రారంభం తరువాత ప్రతి డిపాజిటర్ సాధారణ బీమా నిబంధనలు, షరతుల ప్రకారం బీమా అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుండి ఐదు లక్షల రూపాయలు  తిరిగి పొందుతారు. బ్యాంక్ లైసెన్స్ రద్దు కావడం వల్ల ది కరాద్ జనతా కోఆపరేటివ్ బ్యాంక్ వ్యాపారం చేయలేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.  

Follow Us:
Download App:
  • android
  • ios