Asianet News TeluguAsianet News Telugu

తప్పుడు సమాచారం, కథనాలు నమ్మోద్దు.. పంజాబ్, హర్యానా రైతుల ఆందోళనపై రిలయన్స్ క్లారీటి..

ఈ హింసాత్మక చర్యలు వేలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. అలాగే రెండు రాష్ట్రాల్లోని రిలయన్స్ అనుబంధ సంస్థలు నిర్వహిస్తున్న మౌలిక సదుపాయాలు, సేల్స్, సర్వీస్ కేంద్రాలు, కీలకమైన సమాచార మార్పిడికి నష్టం, అంతరాయం కలిగిస్తున్నాయని పేర్కొంది.
 

Reliance says no plans to enter contract farming and public and media to be aware of the correct facts
Author
Hyderabad, First Published Jan 4, 2021, 1:32 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐ‌ఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్‌జే‌ఐ‌ఎల్) పంజాబ్, హర్యానా హైకోర్టులో నేడు దాఖలు చేయనున్న పిటిషన్లో చట్టవిరుద్ధమైన విధ్వంసక చర్యలును పూర్తిస్థాయిలో నిలిపివేయడానికి ప్రభుత్వ అధికారుల తక్షణ జోక్యాన్ని కోరింది. 

ఈ హింసాత్మక చర్యలు వేలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. అలాగే రెండు రాష్ట్రాల్లోని రిలయన్స్ అనుబంధ సంస్థలు నిర్వహిస్తున్న మౌలిక సదుపాయాలు, సేల్స్, సర్వీస్ కేంద్రాలు, కీలకమైన సమాచార మార్పిడికి నష్టం, అంతరాయం కలిగిస్తున్నాయని పేర్కొంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) కాంట్రాక్ట్ లేదా కార్పొరేట్ వ్యవసాయంలోకి ప్రవేశించే ఆలోచన లేదని, కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం భారతదేశంలో ఏ వ్యవసాయ భూమిని కొనుగోలు చేయలేదని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ఈ విధ్వంసానికి పాల్పడే దుండగులను మా వ్యాపార ప్రత్యర్థులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రేరేపించారు, సహాయం చేశారు.  రైతుల ఆందోళనను సద్వినియోగం చేసుకోడానికి రిలయన్స్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది.

పంజాబ్ & హర్యానా హెచ్‌సిలో కొనసాగుతున్న విధ్వంసానికి వ్యతిరేకంగా కంపెనీ ఈ రోజు రాతపూర్వక పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆర్‌ఐఎల్ పేర్కొంది. రిలయన్స్ సంస్థపై హానికరమైన, ప్రేరేపిత దుర్బల ప్రచారాన్ని రైతుల ఆందోళనను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయని, రిలయన్స్ పై వచ్చిన ఆరోపణలలో ఎటువంటి ఆధారం లేదు అని పేర్కొంది.


1. రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌ఎల్), రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్‌జే‌ఐ‌ఎల్), లేదా మరేదైనా అనుబంధ సంస్థ "కాంట్రాక్ట్" వ్యవసాయం వ్యాపారంలోకి ప్రవేశించడానికి ఎటువంటి ప్రణాళికలు లేవు.

2. రిలయన్స్ లేదా మా అనుబంధ సంస్థలు పంజాబ్ / హర్యానాలో లేదా భారతదేశంలో మరెక్కడైనా  ఏ వ్యవసాయ భూమిని నేరుగా లేదా పరోక్షంగా కొనుగోలు చేయలేదు. “కార్పొరేట్” ప్రయోజనం కోసం
లేదా “కాంట్రాక్ట్” వ్యవసాయం పై మాకు ఖచ్చితంగా ప్రణాళికలు లేవు.

3. రిలయన్స్ రిటైల్ భారతదేశంలో ఆర్గానైజేడ్ రిటైల్ వ్యాపారంలో సరిపోలని నాయకుడు. రైతుల నుండి నేరుగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయలేదని, దాని సరఫరాదారులు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) స్థాయిలో మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేస్తారని ఆర్‌ఐఎల్ తెలిపింది.

4. రిలయన్స్ కు భారతదేశ రైతుల  పట్ల గొప్ప గౌరవం ఉంది అని కంపెనీ తెలిపింది.  కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన సందర్భంగా పంజాబ్‌లోని 1,500 కు పైగా టెలికం టవర్లు దెబ్బతిన్నాయి.

రిలయన్స్ జియో  4జి నెట్‌వర్క్ ప్రతి గ్రామానికి ప్రపంచ స్థాయి డేటా కనెక్టివిటీని అందించింది. అక్టోబర్ 31, 2020 నాటికి పంజాబ్‌లో 140 లక్షలకు పైగా జియో చందాదారులు ఉన్నారు, అలాగే  హర్యానాలో 94 లక్షలు మంది కస్టమర్లు ఉన్నారు. స్వార్థ ప్రయోజనాలకు జియో ఎటువంటి బలవంతపు లేదా చట్టవిరుద్ధమైన చర్యలను ఆశ్రయించలేదు.


కోవిడ్-19 మహమ్మారి సమయంలో జియో  నెట్‌వర్క్ మిలియన్ల కస్టమర్లకు జీవనాధారంగా మారింది. ఇప్పటివరకు రిలయన్స్ టవర్లపై జరిగిన విధ్వంసాలకు రిలయన్స్ పంజాబ్, హరియాణ  అధికారులకు, ముఖ్యంగా పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ప్రజలు, మీడియా సరైన వాస్తవాల గురించి తెలుసుకోవాలని, తప్పుదారి పట్టించే తప్పుడు సమాచారం, కథనాలు నమ్మవద్దని కోరుతున్నాము అని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios