Asianet News TeluguAsianet News Telugu

కరోనా సెకండ్‌వేవ్‌తో భారత్ పోరాడుతుంది.. కఠినమైన చర్యలు అవసరం : ఆర్‌బీఐ గవర్నర్‌

దేశంలో కరోనా మహమ్మారి  ఉధృతి చాలా తీవ్రంగా ఉంది, గత నెల కంటే  పరిస్థితి తీవ్రంగా మారింది కఠినమైన చర్యలు అవసరం అని ఆర్‌బి‌ఐ  గవర్నర్ అన్నారు.

RBI to deploy all resources, monitor emerging COVID19 situation says Shaktikanta Das
Author
Hyderabad, First Published May 5, 2021, 11:27 AM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వీడియోకాన్ఫరెన్స్‌ సమావేశంలో  ప్రసంగిస్తు "కోవిడ్ -19 కేసుల పరిస్థితిని కేంద్ర బ్యాంకు పర్యవేక్షిస్తూనే ఉంటుందని, ముఖ్యంగా సిటిజెన్స్, వ్యాపార సంస్థల కోసం అన్ని వనరులు, సాధనాలను  ఆదేశాల మేరకు అమలు చేస్తామని  అన్నారు.   

దేశంలో  కరోనా వైరస్ సెకండ్ వేవ్  తీవ్రంగా వ్యాపిస్తుంది. పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ విధించడంతో ప్రజలు కలత చెందుతున్నారు. ఈ సంక్షోభం నుండి బయటపడటానికి దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కఠినమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. 

గత 24 గంటల్లో భారతదేశంలో 3,780 మరణాలు, గరిష్టంగా 3,82,315 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అలాగే దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,06,65,148 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది .

గత 14 రోజుల నుండి వరుసగా మూడు లక్షలకు పైగా కేసులు నమోదుతావుతుండగా,  అలాగే ఎనిమిది రోజులుగా 3,000 మందికి పైగా ప్రాణనష్టం జరిగింది.

 కరోనా  ఫస్ట్ వేవ్  తరువాత ఆర్థిక వ్యవస్థ కూడా తిరిగి  కోలుకుంటుంది. కోవిడ్ -19  రెండవ వేవ్ వ్యాప్తిని పరిశీలిస్తే విస్తృతమైన చర్యలు అవసరం. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భారతదేశం వేగంగా కోలుకుంటుంది. వాతావరణ శాఖ ఈ సంవత్సరం సాధారణ రుతుపవనాలను అంచనా వేసింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతాయని భావిస్తున్నారు.

జనవరి నుంచి మార్చి వరకు విద్యుత్ వినియోగం కూడా పెరిగింది.  మార్చిలో భారత ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. పప్పుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. కరోనా కారణంగా సరఫరా గొలుసు విచ్ఛిన్నం కావడం దీనికి కారణం.

also read మ్యారేజ్ లైఫ్ కి గుడ్ బై చెప్పిన బిల్ గేట్స్.. 27ఏళ్ల తరువాత భార్యకు విడాకులు.. ...

ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

మే 20న  రెండోసారి ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోళ్లు

బ్యాంకులకు కోవిడ్‌ లోన్లు, ప్రయారిటీ సెక్టార్‌గా చిన్న ఫైనాన్స​ సంస్థలకు గుర్తింపు

అత్యవసర ఆరోగ్య సంరక్షణ నిమ్తిత్తం  మూడేళ్ల కాలానికిగాను వన్‌టైం లిక్విడిటీ మద్దతు కింద 50 వేల కోట్ల రూపాయలు

ప్రస్తుత సంక్షోభ సమయంలో వీడియో  ద్వారా వినియోగదారులకు  కేవైసీ  అప్‌డేట్‌  సౌకర్యం. కేవైపీ అప్‌డేట్‌ కాని యూజర్లపై ప్రస్తుతానికి  ఎలాంటి  చర్యలుండవు.

 శక్తికాంత దాస్ తన ప్రసంగంలో కరోనా వ్యాధిపై పోరాడటానికి సహకరించిన వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 

 కోవిడ్ -19 కి సంబంధించిన ఆరోగ్య సౌకర్యాల కోసం 2022 మార్చి నాటికి ఆర్‌బిఐ రూ .50 వేల కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సౌకర్యాన్ని ప్రకటించింది. 

దీని ద్వారా  ఆస్పత్రులు, ఆరోగ్య సేవా సంస్థలు కూడా ప్రయోజనం పొందుతాయి. 

రూ.35000 కోట్ల  విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలును మే 20న ప్రారంభిస్తామని చెప్పారు. 

రాష్ట్రాలకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించనున్నారు. ఓవర్‌డ్రాఫ్ట్‌ ద్వారా రాష్ట్రాలకు రాయితీ లభిస్తుంది. ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం వ్యవధిని 50 రోజులకు పెంచారు. అంతకుముందు దీని వ్యవధి 36 రోజులు ఉండేది.

 చిన్న ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్‌ఎఫ్‌బి) కోసం రూ .10,000 కోట్ల వరకు దీర్ఘకాలిక రెపో ఆపరేషన్లను (టిఎల్‌టిఆర్‌ఓ) సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. 

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కెవైసి రూల్ లో కొన్ని మార్పులు చేసినట్లు గవర్నర్ తెలిపారు. కెవైసి ని ఇప్పుడు వీడియో ద్వారా ఆమోదించబడుతుంది. లిమిటెడ్ కెవైసిని 2021 డిసెంబర్ 1 వరకు ఆర్‌బిఐ అనుమతించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios