వరుసగా 234వ రోజు స్థిరంగా ఇంధన ధరలు.. పండగకి పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ పెరగనున్నాయా..?
ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.
నేడు వరుసగా 234వ రోజు మంగళవారం అంటే జనవరి 10న పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. గత ఏడాది 2022 మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై లీటరుకు రూ. 8, డీజిల్పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన ఒక రోజు తర్వాత, మే 22న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి.
ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు నెలల తరబడి స్థిరంగా ఉండగా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని లీటరుకు రూ. 3 చొప్పున పెంచడంతో డీజిల్ ధర పెరిగింది. రాష్ట్రంలో డీజిల్పై గతంలో లీటరుకు రూ.4.40 ఉన్న వ్యాట్ ఇప్పుడు లీటరుకు రూ.7.40కి పెరిగింది.
నేడు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 1.08 డాలర్లు లేదా 1.4 శాతం పెరిగి 79.65 డాలర్ల వద్ద ఉంది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 86 సెంట్లు లేదా 1.2 శాతం పెరిగి $74.63కి చేరుకుంది.