Asianet News TeluguAsianet News Telugu

వాహనదారులపై తగ్గని ఇంధన భారం.. నేటికీ స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

గతంలో ఇంధన ధరలను ప్రతి 15 రోజులకు ఒకసారి అప్‌డేట్ చేసేవారు. 2014లో ప్రభుత్వం ధరలపై నియంత్రణను ఎత్తివేసింది,  2017 నుండి ఇంధన ధరలను ప్రతిరోజూ అప్‌డేట్ చేస్తుంది.
 

Petrol diesel prices increased costlier by 15 paise in Noida what is the rate in your city here-sak
Author
First Published May 11, 2023, 8:27 AM IST

న్యూఢిల్లీ. ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల పెరుగుదల ప్రభావం గురువారం ఉదయం విడుదలైన పెట్రోల్, డీజిల్ తాజా ధరలపై కూడా కనిపిస్తోంది. నేడు ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో చాలా చోట్ల మార్పులు కనిపిస్తున్నాయి. అయితే, ఢిల్లీ-ముంబై వంటి దేశంలోని నాలుగు మహానగరాల్లో నేటికీ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

ప్రభుత్వ ఆయిల్  సంస్థల ప్రకారం, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా-గ్రేటర్ నోయిడా)లో పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి రూ.96.79కి చేరుకుంది. డీజిల్ ధర  కూడా 14 పైసలు పెరిగి రూ.89.96కి చేరుకుంది. అంతేకాకుండా, ఘజియాబాద్‌లో పెట్రోల్ 32 పైసలు తగ్గి లీటరుకు రూ.96.26కి చేరుకుంది. డీజిల్ ధర 30 పైసలు తగ్గి రూ.89.96కి చేరుకుంది. యూపీ రాజధాని లక్నోలో 14 పైసలు తగ్గి  పెట్రోలు లీటరుకి రూ.96.33కి చేరింది. డీజిల్‌ ధర కూడా 13 పైసలు తగ్గి లీటర్‌ ధర రూ.89.53గా ఉంది.

క్రూడాయిల్ ధర గురించి మాట్లాడితే  గత 24 గంటల్లో పెరుగుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు దాదాపు $76.79 డాలర్లకు పెరిగింది. WTI ధర  కూడా బ్యారెల్‌కు $72.96 డాలర్ల వద్ద ఈరోజు పెరుగుదలతో కదులుతోంది.

నాలుగు మెట్రో నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.65, డీజిల్ ధర రూ 89.82
- ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ. 94.27 
- చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ. 94.24
-కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76
-హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర లీటరుకు రూ. 97.82

ఈ నగరాల్లో ధరలు మారాయి
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర లీటరుకు రూ. 89.96.
– ఘజియాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.96.26, డీజిల్‌ ధర రూ.89.96గా ఉంది.
- లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.33, డీజిల్ ధర రూ.89.53గా ఉంది.

గతంలో ఇంధన ధరలను ప్రతి 15 రోజులకు ఒకసారి అప్‌డేట్ చేసేవారు. 2014లో ప్రభుత్వం ధరలపై నియంత్రణను ఎత్తివేసింది,  2017 నుండి ఇంధన ధరలను ప్రతిరోజూ అప్‌డేట్ చేస్తుంది.

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు 
 ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇంకా ఇతర  జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

Follow Us:
Download App:
  • android
  • ios