Asianet News TeluguAsianet News Telugu

కరూర్ వైశ్యా బ్యాంక్ కొత్త ఎం.డి & సిఇఒగా రమేష్ బాబు

రూర్ వైశ్యా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు జూలై 20న జరిగిన సమావేశంలో రమేష్ బాబు బోడ్డును అదనపు డైరెక్టర్‌గా సహకరించి, మూడేళ్ల కాలానికి బ్యాంక్ ఎండి, సిఇఒగా నియమించింది. 

Karur Vysya Bank on Tuesday announced Ramesh Babu Boddu as Managing Director and CEO
Author
Hyderabad, First Published Jul 22, 2020, 11:20 AM IST

న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ కరూర్ వైశ్యా కొత్త  మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రమేష్ బాబు బోడ్డును నియమించినట్లు కరూర్ వైశ్యా బ్యాంక్ మంగళవారం ప్రకటించింది.

రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కరూర్ వైశ్యా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు జూలై 20న జరిగిన సమావేశంలో రమేష్ బాబు బోడ్డును అదనపు డైరెక్టర్‌గా సహకరించి, మూడేళ్ల కాలానికి బ్యాంక్ ఎండి, సిఇఒగా నియమించింది.

మరోవైపు నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) సీఎండీగా సుమిత్‌ దేవ్‌ నియమితులయ్యారు. రమేష్ బాబు మూడేళ్ల పదవీకాలం రిజర్వ్ బ్యాంక్ ఆమోదించిన నిబంధనలు, షరతులపై బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి అమలులోకి వస్తుంది.

also read భ‌విష్య‌త్తులో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ ఎవ‌రైనా కావొచ్చు : రతన్ టాటా ...

అయితే అంతకు ముందు ఉన్న  మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ పి ఆర్ శేషాద్రి వ్యక్తిగత కారణాలను చూపిస్తూ రాజీనామా చేసినట్లు ఈ ఏడాది జనవరిలో కరూర్ వైశ్య బ్యాంక్ తెలిపింది.

జూన్ నెలలో బ్యాంక్ 2020 మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 39.5 శాతం పెరిగి 83.70 కోట్ల రూపాయలుగా నమోదైంది. 2018-19 ఇదే కాలంలో రూ. 60.02 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

2018-19 చివరి త్రైమాసికంలో ఆదాయం 1,746.04 కోట్ల నుండి 1,803.15 కోట్లకు పెరిగింది. కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్లు బిఎస్ఇలో ఒక్కొక్కటి రూ.31.70 వద్ద ట్రేడవుతున్నాయి, అంతకుముందు ముగింపుతో పోలిస్తే ఇది 0.79 శాతం పెరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios