ఐటీ సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌ను ఆఫీసుల‌కు ర‌ప్పించేందుకు ప్రోత్సాహ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్ఆర్ నారాయ‌ణ‌మూర్తి వ్యాఖ్యానించారు. 

వర్క్‌ ఫ్రమ్‌ హోం రాకతో ఇంటికే పరిమితమైన ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలిచే పనిలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే పలు ఐటీ దిగ్గజ కంపెనీలు టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ లాంటి కంపెనీలు ఇప్పటికే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. అయితే గత రెండేళ్ల నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోంకే పరిమితమైన ఐటీ ఉద్యోగుల విషయంలో ఇన్ఫోసిస్‌ వ్యవస్థాసకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఐటీ సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌ను ఆఫీసుల‌కు ర‌ప్పించేందుకు ప్రోత్సాహ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్ఆర్ నారాయ‌ణ‌మూర్తి వ్యాఖ్యానించారు. క‌రోనా నేప‌థ్యంలో రెండేండ్లుగా ఐటీ సంస్థ‌ల ఉద్యోగులు వ‌ర్క్ ఫ్రం హోం ద్వారా సేవ‌లందిస్తున్నారు. కోవిడ్‌-19 తీవ్ర‌త త‌గ్గిపోయినందున ఉద్యోగుల వ‌ర్క్ ఫ్రం హోం క‌ల్చ‌ర్‌ను ముగించాల‌ని సూచించారు. తాను వ‌ర్క్ ఫ్రం హోం విధానానికి అభిమానిని కాద‌ని ఓ ఐటీ స‌మ్మిట్‌లో వ్యాఖ్యానించారు.

ఉద్యోగులు ఇంటి నుంచి ప‌ని చేయ‌డం త‌న‌కు అస‌లు ఇష్ట‌మే లేద‌ని నారాయ‌ణ మూర్తి అన్నారు. సిబ్బంది ఇండ్ల‌కు పరిమితం కావ‌డంతో ఆయా కంపెనీల ఉత్పాద‌క‌త త‌గ్గిపోయింద‌ని చెప్పారు. వ‌ర్క్ ఫ్రం హోం వ‌ల్ల సిబ్బందిలో సృజ‌న‌త్వం సాధ్యం కాద‌ని, ప‌నిలోనూ నాణ్య‌త ఉండ‌ద‌న్నారు. 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రంలో భార‌త్ త‌ల‌స‌రి ఆదాయం త‌గ్గిపోయింద‌న్నారు. 40 ఏండ్ల క్రితం ఏర్పాటైన బంగ్లాదేశ్ కంటే అది త‌క్కువ అని చెప్పారు.

తమ ఉద్యోగులను కార్యాలయానికి వచ్చేలా ప్రోత్సహించాలని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాసకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి ఐటీ కంపెనీలకు హితవు పలికారు. కోవిడ్‌-19 తీవ్రత తగ్గిపోయిందని ఇకపై ఇంటి నుంచి పనిచేసే విధానాలకు స్వస్తి పలకాలన్నారు. బెంగుళూరులో ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఐటీ సమ్మిట్‌లో వర్క్‌ ఫ్రం హోంపై ఎన్‌ఆర్‌ నారాయణమూర్తి తన అభిప్రాయాలను పంచుకున్నారు. వర్క్‌ ఫ్రం హోంకు అంత పెద్ద అభిమానిని కాదని అన్నారు. ఇంటి నుంచి పనిచేయడం తనకు అసలు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. ఇంటి నుంచి పనిచేస్తే సృజన శీలత సాధ్యం కాదన్నారు. పనిలోనూ నాణ్యత ఉండదన్నారు. ఐటీ ఉద్యోగులు ఇంటికే పరిమితమవ్వడంతో కంపెనీల సంస్థాగత వ్యవహరాలు నెమ్మదించిందని తెలిపారు. అంతేకాకుండా కంపెనీల ఉత్పాదకత కూడా తగ్గిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఇప్పటికే పలు కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్దమయ్యాయి.

వర్క్‌ ఫ్రం హోంతో పాటుగా భారత తలసరి ఆదాయంపై కూడా నారాయణమూర్తి హైలైట్‌ చేశారు. 2020-21 గాను నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడిన బంగ్లాదేశ్‌ కంటే భారత తలసరి ఆదాయం తక్కువగా నమోదైందని గుర్తు చేశారు. ఇక రెండవ ప్రపంచ యుద్దం తరువాత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు జర్మనీ తీసుకున్న చర్యలను మూర్తి వివరించారు.