సోయాబీన్ ఆయిల్ ధరను పెంచుతు.. భారతదేశం ముడి చమురు అండ్  రిఫైనేడ్ పామాయిల్  బేస్ దిగుమతి ధరలను తగ్గించినట్లు ప్రభుత్వం మంగళవారం  ఒక ప్రకటనలో తెలిపింది.

క్రూడ్ సోయా ఆయిల్ ధరను పెంచుతూనే, భారతదేశం క్రూడ్ అండ్ రిఫైనేడ్  పామాయిల్  బేస్ దిగుమతి ధరలను తగ్గించినట్లు ప్రభుత్వం మంగళవారం  ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం ప్రతి పదిహేను రోజులకు ఎడిబుల్ ఆయిల్స్, బంగారం, వెండి  బేస్ దిగుమతి ధరలను సవరిస్తుంది అలాగే దిగుమతిదారులు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని లెక్కించడానికి ధరలు ఉపయోగించబడతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతిదారుగా ఉన్న భారతదేశం గత వారం 2 మిలియన్ టన్నుల సోయా ఆయిల్‌ను సుంకం రహిత దిగుమతికి అనుమతించింది.

ఇప్పటికే పెట్రోలు ధరలను తగ్గించిన కేంద్రం కమర్షియల్‌ సిలిండర్‌ ధరలను తగ్గించింది. వీటితో పాటు వంట నూనె ధరల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.

కేం‍ద్రం తాజాగా బేస్‌ దిగుమతి సుంకాలు సవరించడంతో టన్ను క్రూడ్‌ పామాయిల్‌ దిగుమతికి ఇంతకు ముందు 1703 డాలర్లు అవగా ఇప్పుడు 1625 డాలర్లకే రానుంది. రిఫైన్డ్‌ చేసిన పామాయిల్‌ విషయానికి వస్తే ఆర్‌బీడీ పామ్‌ ఆయిల్‌ ధర 1765 నుంచి 1733 డాలర్లకు దిగివచ్చింది. సోయా ఆయిల్‌ టన్ను ధర 1827 నుంచి 1,866కి పెరిగింది.

                             కొత్త ధర డాలర్లలో      పాత ధర  డాలర్లలో
క్రూడ్ పామాయిల్       1,625                       1,703
RBD పామ్ ఆయిల్     1,733                       1,765
RBD పామ్ ఆయిల్     1,744                        1,771
క్రూడ్ సోయాబీన్ ఆయిల్ 1,866                  1,827