తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నిన్నటితో పోలిస్తే నేడు కాస్త పెరిగింది. నిన్న ఒక్కరోజే పసిడి ధర రూ.700 తగ్గిన సంగతి తెలిసిందే. నేడు మళ్లీ తులానికి రూ.150 పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్నాయి. వెండి ధర కూడా నేడు రూ.300 తగ్గింది.

బంగారం ధ‌ర‌లు శుక్ర‌వారం దేశవ్యాప్తంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో నిన్న ఒక్కరోజే పసిడి ధర రూ.700 తగ్గిన సంగతి తెలిసిందే. నేడు మళ్లీ తులానికి రూ.150 పెరిగింది. దీంతో బంగారం ధ‌ర రూ.53,780కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,300కు చేరింది. బంగారం ధ‌ర‌ల‌తో పోలిస్తే వెండి ధర మాత్రం నేలచూపులు చూసింది. నేడు మ‌రో రూ.300 కుప్పకూలింది. దీంతో వెండి కేజీకి రూ.73,000కు చేరింది. 

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధ‌ర‌లు శుక్ర‌వారం పెరిగాయి. నిన్న‌టి పోలిస్తే శుక్ర‌వారం ధ‌ర‌లు పెరిగాయి. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్ర‌వారం (ఏప్రిల్ 22, 2022) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,780గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,460 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,960గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,300 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.53,780 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,780గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,780గా ఉంది.

ఇక‌పోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.49,300 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,780గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.49,300 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,780గా ఉంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతోన్నాయి.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,100 ఉండగా, ముంబైలో రూ.67,100గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.73,000 ఉండగా, కోల్‌కతాలో రూ.67,100గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,000 ఉండగా, కేరళలో రూ.73,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,000 ఉండగా, విజయవాడలో రూ.73,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. అయితే ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.