Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ బేబి పౌడర్ కంపెనీకి కోట్ల జరిమానా.. మహిళకి క్యాన్సర్, మృతి..

 J&J అండ్  Kenvueలకు కోర్టు మొత్తంగా $45 మిలియన్ల జరిమానా విధించింది. ఓ మహిళ పిటిషన్ దాఖలు చేయడంతో  విచారణ అనంతరం.. కంపెనీ విక్రయిస్తున్న టాల్కం బేబీ పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఉందని కోర్టు పేర్కొంది.  
 

fine of crores imposed on this company manufacturing children's goods,  case is related to cancer, know-sak
Author
First Published Apr 22, 2024, 11:51 AM IST

ఫార్మాస్యూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ (J&J) అండ్  కెన్‌వ్యూ(Kenvue)లకు $45 మిలియన్ల(4.5 కోట్ల) జరిమానా విధించబడింది. అయితే కంపెనీ విక్రయించే టాల్కమ్ బేబీ పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఉందిని తేలింది. ఇది ఓ మహిళకి  క్యాన్సర్ ఇంకా ఆమె  మరణానికి కారణమైంది.

ఈ సందర్బంగా J&J అండ్  Kenvueలకు కోర్టు మొత్తంగా $45 మిలియన్ల జరిమానా విధించింది. ఓ మహిళ పిటిషన్ దాఖలు చేయడంతో  విచారణ అనంతరం.. కంపెనీ విక్రయిస్తున్న టాల్కం బేబీ పౌడర్‌లో ఆస్బెస్టాస్ ఉందని కోర్టు పేర్కొంది.  

జాన్సన్ & జాన్సన్ అండ్  కెన్‌వ్యూ పిల్లలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన కంపెనీలు. సాధారణంగా, J&J కంపెనీ ఉత్పత్తులు ప్రతి ఒక్కరి ఇళ్లలో కనిపిస్తాయి. అయితే ఈ ఉత్పత్తిని ఉపయోగించడం వల్ల వారి కుటుంబ సభ్యులకు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి వచ్చిందని, దాని వల్లే ఆమె  చనిపోయిందని ఓ మహిళ కోర్టులో కేసు వేసింది. కంపెనీ విక్రయించిన టాల్కం పౌడర్‌లో ఆస్‌బెస్టాస్‌ ఉందని తేలింది ఇంకా ఆస్బెస్టాస్ మెసోథెలియోమాకు కారణం కూడా.

థెరిసా గార్సియా మృతికి రెండు కంపెనీలే కారణమని ఆ కుటుంబం పిటిషన్  వేసింది. గార్సియా కుమార్తె, స్టెఫానీ సాల్సెడో, ఆమె కుటుంబం తరపున ఈ కేసు దాఖలు చేసింది. మహిళ క్యాన్సర్‌తో 2020లో చనిపోయిందని  కానీ ఆస్బెస్టాస్ వల్ల క్యాన్సర్ వచ్చిందని కుటుంబ సభ్యులు భావించారు. టాల్కం పౌడర్‌లో ఆస్‌బెస్టాస్‌ ఉందని తెలిసినా కంపెనీ విక్రయించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. J&J వారి టాల్క్ ఆధారిత ఉత్పత్తులు క్యాన్సర్‌ను కలిగించవని చెప్పారు. 

 ఈ కేసుపై గత శుక్రవారం  చికాగోలో విచారణ జరిగింది. ఇందులో జ్యూరీ సభ్యులు కంపెనీకి $45 మిలియన్ జరిమానా విధించారు, ఈ మొత్తం  బాధితుల కుటుంబానికి ఇవ్వబడుతుంది.

 టాల్కమ్‌లో ఆస్బెస్టాస్ మలినాలు ఉన్నాయని కంపెనీలకు తెలిసిన తర్వాత కూడా ఆ బేబీ పౌడర్‌ను J&J బాటిళ్లలో విక్రయించారు. 2016లో ఆస్‌బెస్టాస్‌తో కూడిన బేబీ పౌడర్‌ వాడటం వల్ల మహిళకు అండాశయ క్యాన్సర్‌ వచ్చిందని కుటుంబీకులు పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios