Elon Musk: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ ఇచ్చిన బెస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్ అయిన 43 బిలియన్ డాలర్ల క్యాష్ డీల్ కు త్వరలోనే పచ్చజెండా ఊపే అవకాశమున్నట్టు సమాచారం. ఈ డీల్ పై ట్విట్టర్ అతి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
Elon Musk-Twitter : మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ట్విట్టర్ ను టెస్లా CEO ఎలాన్ మస్క్కి విక్రయించే ప్రక్రియ చివరి దశలో ఉందని సమాచారం. సోమవారం నాటికి ఈ డీల్ పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది. రెండు కంపెనీలకు చెందిన సంబంధిత వర్గాల వెల్లడించిన మీడియా నివేదిక ప్రకారం.. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొనుగోలుకు ఎలాన్ మస్క్ ఇచ్చిన బెస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్(Best and final offer) అయిన 43 బిలియన్ డాలర్ల క్యాష్ డీల్ కు త్వరలోనే పచ్చజెండా ఊపే అవకాశమున్నట్టు సమాచారం. ఈ డీల్ పై ట్విట్టర్ అతి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎలాన్ మస్క్ ఆఫర్ చేసిన 54.20 డాలర్ల షేర్ ధర `బెస్ట్ అండ్ ఫైనల్` అని ట్విట్టర్ వర్గాలు అంటున్నట్లు సమాచారం. 43 బిలియన్ల డాలర్లకు సంస్థ విక్రయ డీల్పై సోమవారం అర్థరాత్రి ఈ డీల్ కు సంబంధించిన ట్విట్టర్ బోర్టు ఓ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఈ డీల్ కుదరడంపై ఎంత ఆసక్తి నెలకొంది. అయితే, చివర్లో ఈ డీల్ వెనక్కివెళ్లే అవకాశమూ లేకపోలేదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలావుండగా, ప్రస్తుతం మార్కెట్ వర్గాల్లో ఈ డీల్పై పెద్ద ఎత్తున్న చర్చ జరుగుతోంది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ట్విట్టర్ ను టెస్లా CEO ఎలోన్ మస్క్కి విక్రయించే అవకాశాలు అధికంగా ఉన్నాయని రిపోర్టుల నేపథ్యంలో సోమవారం సాధారణ ట్రేడింగ్లో Twitter స్టాక్ 4% పెరిగింది. మైక్రో-బ్లాగింగ్ కంపెనీ మస్క్తో లావాదేవీ నిబంధనలను రూపొందిస్తోంది. చర్చలు సజావుగా సాగితే సోమవారం రాత్రి వెంటనే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని బ్లూమ్బెర్గ్ పేర్కొంది. షేర్హోల్డర్లకు లావాదేవీని సిఫార్సు చేయడానికి దాని బోర్డు సమావేశమైన తర్వాత, సోమవారం ఒప్పందాన్ని ఆమోదించడానికి మరియు ప్రకటించడానికి Twitter సిద్ధంగా ఉందని రాయిటర్స్ కూడా నివేదించింది. సోమవారం నాటి ప్రీమార్కెట్ ట్రేడింగ్లో Twitter షేర్లు 5.4% అధికంగా $51.56 వద్ద ఉన్నాయి. అలాగే, ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 13% పెరిగాయి.
ఏప్రిల్ 14న తాను కంపెనీని ప్రైవేట్గా తీసుకోవడానికి $43 బిలియన్లు లేదా ఒక్కో షేరుకు $54.20 చెల్లించి కొనుగోలు చేయనున్నట్లు ఎలాన్ మస్క్ చెప్పాడు. ట్విట్టర్ "పాయిజన్ పిల్ విధానాన్ని " అవలంబించడం ద్వారా దీనిని ప్రతిఘటించింది. అది అతని కొనుగోలు ప్రయత్నాన్ని మరింత కష్టతరం చేయడంతో పాటు ఖరీదైనదిగా చేస్తుంది. పాయిజన్ పిల్ షేర్హోల్డర్ రైట్స్ ప్లాన్ కంపెనీ తన షేర్ల విలువను తగ్గించడం ద్వారా తక్కువ ఆకర్షణీయమైన సముపార్జన లక్ష్యాన్ని ప్రభావవంతంగా చేస్తుంది. కానీ మస్క్ ఈ వ్యూహానికి దిగలేదు. ప్రస్తుతం ట్విట్టర్ టేకోవర్ కోసం సుమారు $46.5 బిలియన్లను అందించడానికి అనేక ఫైనాన్సింగ్ కమిట్మెంట్లను పొందినట్లు గత వారం రెగ్యులేటరీ ఫైలింగ్లో ధృవీకరించాడు. ట్విటర్ కు చెందిన 11 మంది సభ్యుల బోర్డు ఎలాన్ మస్క్తో కంపెనీని కొనుగోలు చేసి, సోమవారం తెల్లవారుజామున ప్రైవేట్గా తీసుకువెళ్లాలనే ప్రతిపాదనపై చర్చలు జరుపుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
తొలుత ఎలన్మస్క్కు విక్రయించడానికి ట్విట్టర్ నో చెప్పింది. పట్టువదని మస్క్.. ట్విట్టర్ ను సొంతం చేసుకునేందుకు మరిన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారని తెలిసింది. ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి 46 బిలియన్ డాలర్ల రుణం తీసుకోవడానికి ప్లాన్ సిద్ధంగా ఉందట. ట్విట్టర్ను సులభంగా కొనుగోలు చేయడానికి ఏకంగా ఒక హోల్డింగ్ కంపెనీనే రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం ఎలాఈన్ మస్క్ ఇచ్చిన డీల్ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో ట్విట్టర్ బోర్డు, వాటాదారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతిలోకి రావడం ఖాయమని తెలుస్తోంది.
