Asianet News TeluguAsianet News Telugu

ఐసీఐసీఐ బ్యాంకులో చైనా భారీ పెట్టుబడులు.. ఏకంగా 15 వేల కోట్లు..

క్వాలిఫైడ్ ఇన్స్ టిట్యూషనల్ ప్లేస్ మెంట్ ఒప్పందం కింద దీనిపై చైనా సెంట్రల్ బ్యాంకు అధికారులు సంతకాలు చేశారు. 357 పెట్టుబడిదారులలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఒకటి, ఇందులో దేశీయ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, గ్లోబల్ ఇనిస్టిట్యూషన్లు ఉన్నాయి. 

Chinas central bank invests 15 thousand crores investment in ICICI Bank
Author
Hyderabad, First Published Aug 19, 2020, 3:33 PM IST

ఈ ఏడాది ఆరంభంలో హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్‌లో చైనా సెంట్రల్ బ్యాంక్ పెట్టుబడులు భారత మార్కెట్లో సంచలనం సృష్టించిన తరువాత, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంకులో పెట్టుబడులు పెట్టింది.

క్వాలిఫైడ్ ఇన్స్ టిట్యూషనల్ ప్లేస్ మెంట్ ఒప్పందం కింద దీనిపై చైనా సెంట్రల్ బ్యాంకు అధికారులు సంతకాలు చేశారు. 357 పెట్టుబడిదారులలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఒకటి, ఇందులో దేశీయ మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, గ్లోబల్ ఇనిస్టిట్యూషన్లు ఉన్నాయి.

also read దిగోస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు 10గ్రా పసిడి ధర.. ? ...

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఐసిఐసిఐ బ్యాంకులో చైనా బ్యాంక్ ప్రస్తుత పెట్టుబడికి ఎటువంటి ముప్పు ఉండదు. ఐసీఐసీఐ బ్యాంకులో సింగపూర్, మోర్గాన్ ఇన్వెస్ట్ మెంట్ సొసైటీ జనరల్ లాంటి ఇతర సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి.

పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఈ ఏడాది మార్చిలో హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్‌లో తన వాటాను 1 శాతానికి పెంచడంతో బ్యాంకింగ్ రంగంలో ఈ పెట్టుబడి దగ్గరగా ఉంది. ప్రస్తుతం, భారతదేశంలో చైనా పెట్టుబడులకు ఎటువంటి అడ్డంకులు లేవు, కానీ ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగజారిపోతున్నాయి.

గల్వాన్ వ్యాలీ సరిహద్దు ఘర్షణలో భారతీయ ఆర్మీ సైనికులు మరణించిన తరువాత ప్రస్తుత పెట్టుబడి చర్య  జరిగింది. భారతదేశం, చైనా మధ్య సరిహద్దు పరిస్థితి అప్పటి నుండి చాలా ఉద్రిక్తంగా ఉంది. గత నెలలో టిక్‌టాక్, షేరిట్, వీచాట్‌తో సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios