12:05 PM (IST) Jan 31

Budget 2025 : ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రసంగం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రసంగిస్తున్నారు.

YouTube video player

11:16 AM (IST) Jan 31

Budget 2025: భారీగా పెరగనున్న బంగారం ధరలు

గోల్డ్ దిగుమతులు పెరగడంతో విదేశీ మారకద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతోంది.ఇది రూపాయి పతనానికి ఆజ్యం పోస్తోంది. జువెలరీ పరిశ్రమ సుంకాలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తోంది. మోవైపు బంగార కారణంగా జీడీపీకి అదనపు విలువ జోడింపు లేదా ఎగుమతుల్లో వృద్ధి కూడా పెద్దగా కనిపించకపోవడం ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసింది. దీనికి తోడు బంగారాన్ని బాగా దిగుమతి చేసుకోవడం ద్రవ్యలోటు, కరెన్సీ పతనానికి దారితీస్తోంది. ప్రస్తుతం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.87 వద్దకు చేరడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. దీంతో ఈ బంగారంపై బంగారంపై భారీగా పన్నులు, సుంకాల వడ్డింపు ఉంటుదని భావిస్తున్నారు. మరింత చదవండి

10:59 AM (IST) Jan 31

Budget 2025: బడ్జట్ సమావేశాలు ప్రారంభం రాష్ట్రపతి ప్రసంగం లైవ్ వీడియో

బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి President Droupadi Murmu ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు.

YouTube video player

10:46 AM (IST) Jan 31

Budget 2025: సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన మోదీ

బడ్జెట్ సమవేశాలు మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.

Scroll to load tweet…
10:31 AM (IST) Jan 31

Budget 2025: రైల్వే పై సీరియస్ ఫోకస్

ఇండియన్ రైల్వేని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంతోపాటు పెరుగుతున్న అవసరాలకు తగినట్లు పరుగెత్తించాలంటే.. ఇప్పుడున్న వ్యవస్థ సరిపోతుందా లేదా మార్చాలా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలో రైల్వేకి ఎటువంటి ప్రణాళికలను అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

10:27 AM (IST) Jan 31

Budget 2025: ఆకర్షణీయంగా కొత్త ఇన్ కమ్ టాక్స్

చిన్న మొత్తాల పొదుపు పథకాలకు అధిక వడ్డీని ఇచ్చే మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పథకం ఈ ఏడాది మార్చితో ముగియనుంది. అయితే ఇది కొనసాగుతుందా లేదా అనేది ఈ బడ్జెట్ లో సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే దీనికి మంచి స్పందన వచ్చింది. వాస్తవానికి మహిళల్లో ఆర్థిక స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు ‘ఆజాది కా అమృత్‌ మహోత్సవం’ సందర్భంగా 2023-24 సంవత్సరంలో దీనిని ప్రవేశపెట్టారు.

10:01 AM (IST) Jan 31

పార్లమెంట్ లో ఎకనమిక్ సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ భారత ఎకనమిక్ సర్వేను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం వుంటుంది. 

08:08 PM (IST) Jan 30

BUDGET 2025: బడ్జెట్ పై సామాన్యుడు పెట్టుకున్న అంచనాలు

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న శనివారం 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ పై సామాన్యుని అంచనాలు ఏమున్నాయో చూద్దాం.
  • సామాన్య పౌరుడికి ప్రధాన ఆందోళనలలో ఒకటి ద్రవ్యోల్బణం. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ఇల్లు గడవడం కష్టంగా మారుతోంది. ఈ ఏడాది బడ్జెట్ వారికి కొంత ఉపశమనం కలిగిస్తుందని చాలామంది ఆశిస్తున్నారు. 
  • ఈ బడ్జెట్ లో కూడా ఆదాయపు పన్ను తగ్గింపుపై ప్రజలకు అంచనాలున్నాయి. తక్కువ, మధ్య ఆదాయ వర్గాల ఉద్యోగులు, వ్యాపారులు ఆదాయపన్ను నుండి ఉపశమనం కోరుకుంటున్నారు. 
  • 1961 ఆదాయపు పన్ను చట్టానికి బదులుగా కొత్త ప్రత్యక్ష పన్ను చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. 
  • కూరగాయలు, వంట నూనె, పాలు మరియు ప్యాక్ చేసిన ఆహారం వంటి నిత్యావసర ఆహార పదార్థాల ధరలు ఇటీవల బాగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణం ఏర్పడింది. దీన్ని అదుపు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ... వేతనాలు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా లేవు.
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం బ్యాండ్‌లో ఉంచడానికి కృషి చేస్తోంది, అయితే అధిక ధరలు సగటు పౌరుడిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. మరింత చదవండి

బడ్జెట్ 2025 కి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్, ఇతర విశేషాల కోసం ఏసియా నెట్ న్యూస్ తెలుగు అందిస్తున్న ఈ పేజీని రిప్రెష్ చేస్తూ ఉండండి.