ఓలా ఎలక్ట్రిక్  S1 ప్రో స్కూటర్‌లను 70,000 యూనిట్లను విక్రయించింది, ఇంకా సోమవారం కూడా అత్యంత బడ్జెట్ S1 స్కూటర్‌ను రూ.99,000కు లాంచ్ చేసింది. 

ఓలా ఎలక్ట్రిక్ సోమవారం మొదటి ఎలక్ట్రిక్ కార్ మరొ గ్లింప్స్(glimpse) అందించింది. ఓలా CEO భవిష్ అగర్వాల్ గత సంవత్సరం S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసిన తర్వాత కంపెనీ మరో ఇది మరొక పెద్ద అడుగుగా దీనిని పేర్కొన్నారు. ఓలా ఎలక్ట్రిక్ కారుని 2024లో అధికారికంగా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు ఇప్పటికే ఇండియాలో అత్యంత వేగవంతమైన బ్యాటరీతో నడిచే ఫోర్ వీలర్‌గా పేర్కొనబడుతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో స్కూటర్‌లను 70,000 యూనిట్లను విక్రయించింది, ఇంకా సోమవారం కూడా అత్యంత బడ్జెట్ S1 స్కూటర్‌ను రూ.99,000కు లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు కంపెనీ పూర్తి దృష్టి ఓలా ఎలక్ట్రిక్ కారుపై పడింది, ఈ కారు నాలుగు సెకన్లలో 100 కి.మీ స్పీడ్, ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 500 కి.మీ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. 

ఈ ఎలక్ట్రిక్ కారులో ఆల్-గ్లాస్ రూఫ్, కీలెస్ ఆపరేషన్, డ్రాగ్ కోఎఫీషియంట్ 0.21, అసిస్టెడ్ డ్రైవ్ టెక్నాలజీ ఉంటుందని అగర్వాల్ పేర్కొన్నారు.

Ola ఎలక్ట్రిక్ భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌ను విప్లవాత్మకంగా మార్చడానికి కొన్ని భారీ వాగ్దానాలు చేస్తోంది. అయితే S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు అధిక స్పందన లభించింది. కస్టమర్ స్పందన తగ్గిందని కొన్ని సూచనలు సూచిస్తున్నప్పటికీ, బెంగళూరు సమీపంలోని ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడం కొనసాగిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో ప్రతి సంవత్సరం ఒక మిలియన్ (1 లక్ష) ఎలక్ట్రిక్ కార్లను, 10 మిలియన్ (10 లక్షలు) ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయగలదని అగర్వాల్ పేర్కొన్నారు. 

ఇప్పుడు అందరి దృష్టి ఓలా ఎలక్ట్రిక్ కారుపైనే ఉంది. భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ బ్యాటరీతో నడిచే త్రీ అండ్ టు వీలర్ వాహనాలపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తోంది. టాటా మోటార్స్ మూడు ఎలక్ట్రిక్ ఉత్పత్తులతో మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో బలమైన ఉనికిని కొనసాగిస్తోంది. దీనితో పాటు ఇతర కంపెనీల గురించి మాట్లాడుతూ కోనా EVతో హ్యుందాయ్, ZS EVతో MG మోటార్ ఇండియాలో ఉన్నాయి.