Asianet News TeluguAsianet News Telugu

మహీంద్రా ఎక్స్‌యూ‌వి కొత్త కార్ పై బిగ్ అప్ డేట్.. ఈ తేదీన కర్టెన్ రైజర్.. లుక్స్ వేరే లెవెల్..

ఈ వీడియో  ప్రారంభంలో ఎక్స్‌యూ‌వి400  ఎలక్ట్రిక్ ఛార్జర్ ప్లగ్ నుండి తీస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత డి‌ఆర్‌ఎల్ స్టార్ట్ అయిన వెంటనే ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఆన్ అవుతాయి. ఆ తర్వాత కొత్త  ట్విన్‌ పీక్ లోగోపై లైట్, దీని తరువాత ఫ్రంట్ గ్రిల్‌తో కొత్త లోగో  కనిపిస్తుంది. 

Mahindra has given big update on electric XUV400 curtain rise on this date
Author
First Published Sep 2, 2022, 4:52 PM IST

దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర నుండి ఎక్స్‌యూ‌వి400 పై  ఒక బిగ్ అప్ డేట్ ఇచ్చింది. కంపెనీ  పరిచయం చేయనున్న ఎలక్ట్రిక్ కార్ వివరాలను సోషల్ మీడియా అండ్ అఫిషియల్ వెబ్‌సైట్‌లో షేర్ చేసింది.

ఈ తేదీన 
కొత్త ఎలక్ట్రిక్ ఎక్స్‌యూ‌వి400ని సెప్టెంబర్ 8న పరిచయం చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే కొత్త ట్విన్‌ పీక్ తో పాటు కొత్త ఎక్స్‌యూ‌వి400ని తీసుకువస్తున్నట్లు 15-సెకన్ల వీడియో చూపిస్తుంది.  ఇంకా ఇంటిగ్రేటెడ్ DRLలు, కొత్త ఫ్రంట్ గ్రిల్, టెయిల్ ల్యాంప్‌ల కోసం కొత్త డిజైన్, రీప్రొఫైల్డ్ టెయిల్ గేట్‌లతో  కొత్త హెడ్‌లైట్స్  పొందుతుంది. 

 వీడియో ఎలా ఉందంటే 
ఈ వీడియో  ప్రారంభంలో ఎక్స్‌యూ‌వి400  ఎలక్ట్రిక్ ఛార్జర్ ప్లగ్ నుండి తీస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత డి‌ఆర్‌ఎల్ స్టార్ట్ అయిన వెంటనే ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఆన్ అవుతాయి. ఆ తర్వాత కొత్త  ట్విన్‌ పీక్ లోగోపై లైట్, దీని తరువాత ఫ్రంట్ గ్రిల్‌తో కొత్త లోగో  కనిపిస్తుంది.  తరువాత ఎక్స్‌యూ‌వి400  బ్యాడ్జింగ్ వీడియోలో చూడవచ్చు. చివరగా, రివీల్ తేదీని ప్రకటించారు. 

ఎక్స్‌యూ‌వి300 లాగానే ఎక్స్‌యూ‌వి400 ఉంటుందా?
కొత్త ఎక్స్‌యూ‌వి400  కూడా ఎక్స్‌యూ‌వి300 సైజ్ ఉంటుందని భావిస్తున్నారు. ఎక్స్‌యూ‌వి400 4.2 మీటర్ల పొడవు ఉండొచ్చు, అంటే ఎక్స్‌యూ‌వి300 కంటే ఎక్కువ బూట్ స్పేస్‌ను ఇస్తుంది. ఎక్స్‌యూ‌వి300  మొత్తం పొడవు 3995ఎం‌ఎం, వెడల్పు 1821ఎం‌ఎం, ఎత్తు 1627 ఎం‌ఎం, ఎక్స్‌యూ‌వి300  వీల్‌బేస్ 2600 ఎం‌ఎం. 

డ్రైవింగ్ రేంజ్ ఎలా ఉంటుంది
ఎక్స్100 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా మహీంద్రా ఎక్స్‌యూ‌వి400  ఎన్‌ఎం‌సి బ్యాటరీని ఉపయోగిస్తుంది. టాటా  నెక్సన్ ఈ‌విలో ఉపయోగించిన సిలిండ్రికల్ LFP సెల్స్ కంటే ఈ బ్యాటరీ సెల్స్ మెరుగ్గా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఎన్‌ఎం‌సి బ్యాటరీ కారుకు ఎక్కువ శక్తిని, ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. కొత్త మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూ‌వి ఫుల్ ఛార్జింగ్ పై 400 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ అందించే అవకాశం ఉంది. 
 
మహీంద్రా కంపెనీ  ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌యూ‌వి400 ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా అండ్ ఎం‌జి కార్లతో పోటీపడుతుంది. టాటా నుండి నెక్సన్ ఈ‌వి, ఈ‌వి మ్యాక్స్ ఎలక్ట్రిక్ వెర్షన్లలో వస్తాయి, ఎం‌జి నుండి జెడ్‌ఎస్ ఈ‌వి ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios