పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి ఈ ఆఫర్ మొత్తం ఓనం పండుగ కాలంలో వర్తిస్తుంది. అదనంగా కస్టమర్‌లు ఇ-స్కూటర్‌పై ఐదేళ్ల వారంటీని పొందుతారు, ఇంకా ఇందులో రెండేళ్లపాటు పొడిగించిన వారంటీ ఉంటుంది.  


భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ హీరో ఎలక్ట్రిక్ పండుగ సీజన్ ప్రారంభానికి గుర్తుగా అద్భుతమైన ఓనం ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కేరళలోని ప్రతి 100వ కస్టమర్‌కు ఉచిత ఇ-స్కూటర్‌ను అందిస్తుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి ఈ ఆఫర్ మొత్తం ఓనం పండుగ కాలంలో వర్తిస్తుంది. అదనంగా కస్టమర్‌లు ఇ-స్కూటర్‌పై ఐదేళ్ల వారంటీని పొందుతారు, ఇంకా ఇందులో రెండేళ్లపాటు పొడిగించిన వారంటీ ఉంటుంది. 

ఈ సందర్భంగా హీరో ఎలక్ట్రిక్ సిఇఒ సోహిందర్ గిల్ మాట్లాడుతూ, “ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము అలాగే గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్స్ స్వీకరణను వేగవంతం చేసే ఆలోచనలో ఇటువంటి సెలెబ్రేషన్స్ ఉన్నాయని నమ్ముతున్నాము. ఓనం కేరళలో ఎక్కువ రోజుల వేడుకలకు నాంది పలికింది, కస్టమర్ సెంటిమెంట్‌లలో మొత్తం సానుకూలతను ప్రతిబింబిస్తుంది. మేము దూర ప్రాంతాల మా కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిని మరింతగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ ఓనం పండుగ కాలంలో మేము ఎలక్ట్రిక్ వాహనాలను విప్లవాత్మకంగా మార్చడానికి మరో అడుగు వేస్తున్నాము." అని అన్నారు. 

ఈ సంవత్సరం ప్రారంభంలో దేశవ్యాప్తంగా 1000 టచ్‌పాయింట్‌లను సాధించడానికి కంపెనీ కేరళలోని మల్లాపురంలో అతిపెద్ద డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల ఫైనాన్సింగ్ సౌలభ్యం కోసం AU స్మాల్ బ్యాంక్‌తో భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించింది. భారతదేశం బిలియన్ ఎలక్ట్రిక్ వాహనాల కలలను సాకారం చేయడానికి కట్టుబడి, హీరో ఎలక్ట్రిక్ 'నో ఎమిషన్' మిషన్‌కు మద్దతుగా ఎలక్ట్రిక్ 2-వీలర్లను విస్తరింపజేస్తూనే ఉంది.