ప్రముఖ వాహన కంపెనీ జావా బైక్‌లలోని కొన్ని మోడళ్లపై 10,000 రూపాయల వరకు తగ్గింపును అందించబోతోంది. మరికొద్ది రోజుల్లో 2023 ముగియనున్న నేపథ్యంలో వివిధ కంపెనీలు కార్లు, బైక్‌లపై ఈ భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.  

2023 సంవత్సరం ముగియడానికి కొద్ది రోజుల సమయం ఉండటంతో కస్టమర్‌లను ఆకర్షించేందుకు కార్లు, బైక్‌ల విక్రయ సంస్థలు వివిధ ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఇందులో ప్రముఖ వాహన కంపెనీ జావా బైక్‌లలోని కొన్ని మోడళ్లపై 10,000 రూపాయల వరకు తగ్గింపును అందించబోతోంది. మరికొద్ది రోజుల్లో 2023 ముగియనున్న నేపథ్యంలో వివిధ కంపెనీలు కార్లు, బైక్‌లపై ఈ భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దీని తరువాత కంపెనీ ఇప్పుడు ప్రముఖ జావా అండ్ ఎజ్ది బైక్‌లపై ఆఫర్‌లను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని గమనించాలి. ఈ రెండు బైక్‌లు చాలా ఏళ్లుగా చాలా మందికి ఇష్టమైన బైక్‌లు కావడం గమనార్హం. 

 ఆఫర్ ఏంటంటే
మీరు మీ పాత బైక్‌ను "ఎక్స్‌ఛేంజ్" మోడ్ ద్వారా కొత్త జావా బైక్‌ను కొనుగోలు చేసినప్పుడు పాత బైక్ ధర కంటే మీకు రూ.10,000 వరకు తగ్గింపు లభిస్తుంది. కానీ ఈ ఆఫర్ అన్ని జావా అండ్ ఎజ్ది బైకులపై అందుబాటులో లేదు. 

ఈ ఆఫర్ కేవలం జావా 42 అండ్ ఎజ్ది రోడ్స్టర్ అనే రెండు బైక్‌లపై మాత్రమే వర్తిస్తుంది. మీరు ఈ రెండు బైక్‌లను సింగిల్ టోన్ కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేసినట్లయితే మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కస్టమర్‌లు పాత వాహనాన్ని మార్చుకుంటే 10,000 రూపాయల వరకు తగ్గింపు ఇంకా 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వరకు వారంటీని పొందుతారు. 

సాధారణంగా, బైక్‌లు 2 సంవత్సరాలు లేదా 24,000 కిలోమీటర్ల వరకు (షరతులకు లోబడి) ఉచిత రిపేర్స్ ద్వారా కవర్ చేయబడతాయి. కానీ ఈ ఎక్స్ఛేంజ్ మోడ్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు, మీరు అదనంగా పది వేల రూపాయలు ఇంకా 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వరకు ఎక్స్టెండెడ్ వారంటీని పొందుతారు. 

జావా 42 బైకు విషయానికొస్తే, ప్రస్తుతం దాదాపు రూ. 1.98 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విక్రయించబడుతోంది. అదేవిధంగా ఎజ్ది రోడ్స్టర్ దాదాపు 2.3 లక్షల రూపాయల ధరతో విక్రయించబడుతోంది.