ఈ రెండు మొక్కలు ఇంట్లో ఉంటే.. ఆ ఇంట లక్ష్మీ దేవి కలకలలాడుతుంది..!
తులసి మొక్క ఉన్న ఇల్లు.. ఎంతో శుభ్రప్రదంగా ఉంటుందని నమ్ముతారు. ఈ తులసి మొక్క లో లక్ష్మీ దేవితో పాటు విష్ణు దేవుడు కూడా ఉాంటాడని చాలా మంది నమ్ముతారు.
హిందూ మతంలో తులసి మొక్కకి ప్రాధాన్యత చాలా ఎక్కువ. తులసి ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచని వారు కూడా.. ఇంటి ముందు తులసి మొక్కను పెంచుతారు. తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల.... ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతుందని అందరూ నమ్ముతారు. అంతేకాదు.. తులసి మొక్క ఉన్న ఇల్లు.. ఎంతో శుభ్రప్రదంగా ఉంటుందని నమ్ముతారు. ఈ తులసి మొక్క లో లక్ష్మీ దేవితో పాటు విష్ణు దేవుడు కూడా ఉాంటాడని చాలా మంది నమ్ముతారు.
అయితే.. కేవలం ఈ తులసి మొక్కలు మాత్రమే కాకుండా.. మరో రెండు మొక్కలను కూడా పెంచడం వల్ల.. మరింత అదృష్ట కలిసొస్తుందట. తులసితో పాటు ఆ రెండు మొక్కలను నాటడం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల పూజలు కూడా జరుగుతాయని చెబుతారు. అవి శమీ, నల్ల ధాతురా ( ఉమ్మెత్త పువ్వు) . దీని వల్ల ఆర్థిక సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. నల్ల ధాతురా మొక్కలో శివుడు కొలువై ఉంటాడని ఒక పురాణం చెబుతోంది.
వాస్తు ప్రకారం, ఇంట్లో తులసి మొక్క నాటితే.. ఎప్పుడూ ఆర్థిక సమస్యలను కలిగించదు. అదేవిధంగా ఉద్యోగ, వ్యాపారాలలో మంచి పురోగతి సాధించే అవకాశం ఉంది. తులసి లోనూ రెండు రకాలు ఉంటాయి. మామూలు తులసి మొక్క తో పాటు.. నల్ల తులసి( విష్ణు తులసి) ని కూడా కలిపి నాటాలి.ఈ రెండు మొక్కలను కలిపి నాటి.. పూజించడం వల్ల మరింత మంచి జరుగుతుందట. ఈ మొక్కలను పూజిస్తే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకేసారి పూజించినంత సమానమట. ఇలా పూజలు చేయడం వల్ల పితృ దోషం తొలగిపోతుంది. కుటుంబంలో శ్రేయస్సు ఉంటుంది.