గణపతి నవరాత్రులలో తప్పక చదవాల్సిన శ్లోకం
దేవతలందరికంటే ముందుగా పూజింపబడేవాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన, ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను.
జపించిన వారికి కోరిన ఫలములు లభించుచు అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు.
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకమ్
భక్తావాసం స్మరేనిత్యం
ఆయుష్కామార్థసిద్ధయే
తాత్పర్యం : దేవతలందరికంటే ముందుగా పూజింపబడేవాడు, గౌరీ తనయుడు, విఘ్నాధిపతీ ఐన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధన, ధాన్య ఐశ్వర్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ఆరాధించెదను.
ప్రదశమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకమ్
తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్
ప్రదశమనామం వక్రతుండ (ఒంపు తిరిగిన తొండము కలవాడు) ద్వితీయ నామం : ఏకదంత (ఒకే దంతం కలవాడు) తృతీయ నామం, కృష్ణపింగాక్ష (ముదురు గోధుమరంగు కన్నులవాడు) చతుర్థనామం : గజవక్త్ర (ఏనుగు ముఖము వంటి ముఖము కలవాడు)
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవచ
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్
పంచమ నామం లంబోదరం (పెద్ద పొట్టకలవాడు) షష్ఠమనామం : వికట (భారీ కాయం కలవాడు) సప్తమ నామం : విఘ్నరాజా (విఘ్నాలను తొలగించేవాడు) అష్టమ నామం ధూమ్రవర్ణ ( గచ్చకాయ రంగు కలవాడు)
నవమం బాలచంద్ర చ దశమంతు వినాయకమ్
ఏకాథం గణపతిం ద్వాథంతు గజాననమ్
నవమ నామం బాలచంద్ర (చంద్రుని శిరస్సుపై ధరించేవాడు) దశమం వినాయక (విఘ్నములకు నాయకుడు) ఏకాదశ నామం : గణపతి (దేవగణములకు అధిపతి) ద్వాదశ నామం : గజానన (ఏనుగు ముఖము కలవాడు)
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధి కరం ప్రభుః
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టానాం బ్రాహ్మణానాం చ లిఖిత్వా యః సమర్పయేత్
తస్యవిద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః
ద్వాదశ నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్నవారికి జ్ఞానము, ధనధాన్యములు కోరుకున్న వారికి ధనధాన్యవృద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునేవారికీ పుత్ర సంతానం మరియు మోక్ష సిద్ధి కోరుకునేవారికి మోక్షం సిద్ధించును.
ఈ సంకలనాశన గణపతి స్తోత్రం ఆరుమాసాలపాటు జపించిన వారికి కోరిన ఫలములు లభించును. ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏ మాత్రం సందేహంలేదు.
ఈ సంకలనాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి ఎనమండుగురు బ్రాహ్మణులకు దానం చేసిన యెడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములు సిద్ధించును.