Asianet News TeluguAsianet News Telugu

70 మందితో వైసీపీ తొలి జాబితా

వైసీపీ తొలి జాబితా మరికొద్దిసేపట్లో విడుదల కానుంది. ఉదయం 10.30గంటలకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు.

today jagan releases the candidates first list of his party
Author
Hyderabad, First Published Mar 13, 2019, 9:55 AM IST

వైసీపీ తొలి జాబితా మరికొద్దిసేపట్లో విడుదల కానుంది. ఉదయం 10.30గంటలకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. 70 నుంచి 80 మందితో తొలి జాబితాను విడుదల చేయనున్నారు. 

అలాగే పార్టీలో చేరికలను బట్టి రెండు మూడు రోజుల్లో రెండో జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. 20 నుంచి 40 మంది అభ్యర్థులతో వైసీపీ రెండో జాబితా విడుదల కానుంది. 

కాగా... జాబితా ప్రకటన పూర్తయిన తర్వాత ఇడుపులపాయకు జగన్‌ వెళ్లనున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ఎన్నికల ప్రచారాన్ని జగన్‌ ప్రారంభించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios