సినీ నటుడు నాగార్జున ఆ మధ్య వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంపై సినీ నటి జయసుధ స్పందించారు. కొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉన్న సినీ నటి జయసుధ గురువారం వైసీపీలో చేరారు. 

హైదరాబాద్: సినీ నటుడు నాగార్జున ఆ మధ్య వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంపై సినీ నటి జయసుధ స్పందించారు. కొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉన్న సినీ నటి జయసుధ గురువారం వైసీపీలో చేరారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హైదరాబాదులోని లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జగన్‌, నాగార్జున భేటీపై చంద్రబాబు చేసిన విమర్శలపై జయసుధ స్పందించారు. 

జగన్ లాంటి వ్యక్తులను సినీ నటులు కలవడం దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ మాటలు చంద్రబాబు మాట్లాడకూడదని, ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులంతా సినీ ఇండస్ట్రీ వాళ్లేనని జయసుధ చెప్పారు. 

సినీ నటులు ఎందుకు జగన్ ను కలవకూడదని ఆమె ప్రశ్నించారు. సినిమా వాళ్లంటూ తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదని, వాళ్లు కూడా ఈ దేశంలో ఓటర్లేనని జయసుధ అన్నారు.