గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ఉమ్మారెడ్డి , మైలవరంలో ‘వసంత’కు షాక్.. వైసీపీ ఆరో జాబితా ఇదే
త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరో జాబితాను వైసీపీ ప్రకటించింది. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమోదముద్ర అనంతరం ఆరో జాబితాను ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసింది.
![ysrcp released 6th list of candidates for 2024 ap assembly and lok sabha elections ksp ysrcp released 6th list of candidates for 2024 ap assembly and lok sabha elections ksp](https://static-ai.asianetnews.com/images/84b36eb8-13a6-4d4c-8e68-c7b743413f18/image_363x203xt.jpg)
త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆరో జాబితాను వైసీపీ ప్రకటించింది. ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆమోదముద్ర అనంతరం ఆరో జాబితాను ఆ పార్టీ శుక్రవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు జాబితాలను విడుదల చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. 61 మందిని అసెంబ్లీ , 14 మందిని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లుగా నియమించింది.
- రాజమండ్రి (ఎంపీ) - డాక్టర్ గూడూరి శ్రీనివాస్
- నర్సాపురం (ఎంపీ) - గూడూరి ఉమాబాల
- గుంటూరు (ఎంపీ ) - ఉమ్మారెడ్డి వెంకట రమణ
- చిత్తూరు (ఎస్సీ) (ఎంపీ) - ఎన్ రెడ్డప్ప
- మైలవరం - సర్నాల తిరుపతిరావు యాదవ్
- మార్కాపురం - అన్నా రాంబాబు
- గిద్దలూరు - కె. నాగార్జున రెడ్డి
- నెల్లూరు సిటీ - ఎండీ. ఖలీల్ (డిప్యూటీ మేయర్)
- జీడీ నెల్లూరు - కె నారాయణ స్వామి
- ఎమ్మిగనూరు - బుట్టా రేణుక