Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ హెలికాఫ్టర్‌లో కాదు.. రోడ్లపై తిరగాలి, పవన్‌కు రఘురామ ప్రశంసలు

రోడ్ల దుస్థితిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పంద‌న‌ను ఆహ్వానిస్తున్నాన‌ని వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు అన్నారు. తాము కూడా ముందు నుంచి రోడ్ల ప‌రిస్థితి గురించి మాట్లాడుతున్నామ‌ని ఆయన చెప్పారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సైనికుల‌తో రోడ్ల‌పై ఉన్న గోతుల‌కు సంబంధించిన ఫొటోలు తీసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయాల‌ని చెప్పారని, జ‌న సైనికులు ఆ ప‌నిచేస్తున్నారని చెప్పారు.

ysrcp mp raghu ramakrishnam raju slams ap cm ys jagan over roads
Author
New Delhi, First Published Sep 7, 2021, 3:36 PM IST

వైసీసీ రెబల్, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చుట్టూ ఉండేవారు ఆయ‌న‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి చెప్ప‌ట్లేదని, పొగ‌డ‌డానికే ప‌రిమితం అయ్యార‌ంటూ వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ర‌హ‌దారుల స‌మ‌స్య‌ల‌పై నిన్న సీఎం జ‌గ‌న్ జ‌రిపిన రివ్యూను ఆహ్వానిస్తున్నానని, అయితే, ర‌హ‌దారుల‌పై సీఎం రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాదని హితవు పలికారు. గ‌త ప్రభుత్వం వ‌ల్లే రోడ్లన్నీ గుంత‌లమ‌యంగా ఉన్నాయని అన‌డం ఏంటీ? అని ఆయ‌న ప్రశ్నించారు. హెలికాప్ట‌ర్లో కాకుండా రోడ్ల‌పై తిర‌గాల‌ని జ‌గ‌న్‌ను కోరుతున్నాన‌ని రఘురామ చెప్పారు.

రోడ్ల దుస్థితిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పంద‌న‌ను ఆహ్వానిస్తున్నాన‌ని ర‌ఘురామ అన్నారు. తాము కూడా ముందు నుంచి రోడ్ల ప‌రిస్థితి గురించి మాట్లాడుతున్నామ‌ని  ఆయన చెప్పారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సైనికుల‌తో రోడ్ల‌పై ఉన్న గోతుల‌కు సంబంధించిన ఫొటోలు తీసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయాల‌ని చెప్పారని, జ‌న సైనికులు ఆ ప‌నిచేస్తున్నారని చెప్పారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం రోడ్ల‌ను బాగు చేయిస్తే నేడు ప‌వ‌న్ క‌ల్యాణ్ గానీ, నేనుగానీ, చంద్ర‌బాబు నాయుడు గానీ ప్ర‌భుత్వానికి చెప్పాల్సిన అవ‌స‌రం ఉండేది కాదని ర‌ఘురామ గుర్తుచేశారు. ఈ ప్ర‌భుత్వ నేత‌లు మారాల‌ని, మారుతార‌ని ఆశిస్తున్నానని అన్నారు. అలాగే, ఒక్క దేవాల‌యానికే క‌రోనా నిబంధ‌న‌లా? అని ర‌ఘురామ ప్ర‌శ్నించారు. మ‌ద్యం దుకాణాలు ఎల్ల‌ప్పుడూ తెరిచే ఉంటున్నాయని, మ‌రి హిందువులు పండుగ‌లు జ‌రుపుకోకుండా ఆక్ష‌లు ఎందుక‌ని ఆయ‌న అడిగారు
 

Follow Us:
Download App:
  • android
  • ios