Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి ఎంపీ స్థానానికి ఉపఎన్నిక: వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి నామినేషన్

తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ (వైసీపీ) అభ్యర్ధిగా బరిిలో దిగిన  డాక్టర్ గురుమూర్తి  సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు.

Ysrcp MP candidate files nomination for Tirupati Mp Lok Sabha bypoll lns
Author
Tirupati, First Published Mar 29, 2021, 2:49 PM IST

తిరుపతి ఎంపీ స్థానానికి ఉపఎన్నిక: వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి నామినేషన్

తిరుపతి:తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ (వైసీపీ) అభ్యర్ధిగా బరిిలో దిగిన  డాక్టర్ గురుమూర్తి  సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు.తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్  అనారోగ్యంతో గత ఏడాది మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.

ఈ స్థానం నుండి తమ పార్టీ అభ్యర్ధిని డాక్టర్ గురుమూర్తిని సీఎం జగన్ ఖరారు చేశారు.  డాక్టర్ గురుమూర్తి  సోమవారం నాడు పార్టీ నేతలు, మంత్రులు వెంటరాగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా  మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్ధిగా రిటైర్ట్ ఐఎఎస్ అధికారి రత్నప్రభను ఆ పార్టీ బరిలోకి దింపింది.ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ పట్టుదలతో ఉంది. ఈ స్థానంలో విజయం సాధించడం కోసం టీడీపీ, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి.

టీడీపీకి ఎన్నికల వ్యూహాకర్తగా రాబిన్ శర్మ వ్యవహరిస్తున్నారు.  ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో  మెజారిటీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకొంది. విపక్షాలకు నామమాత్రంగానే సీట్లు దక్కాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios