Asianet News TeluguAsianet News Telugu

విషం ఎక్కడో లేదు.. చంద్రబాబు బుర్రలోనే అంతా : కొడాలి నాని వ్యాఖ్యలు

కుట్రలు, కుతంత్రాలతో వళ్లంతా కుళ్లిపోయిన వ్యక్తి చంద్రబాబంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. జగన్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ఎన్నో కుట్రలు చేశారని నాని ఆరోపించారు.

ysrcp mla kodali nani slams tdp chief chandrababu naidu over his remarks on adulterated liquor
Author
Amaravati, First Published Jun 29, 2022, 4:57 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలతో వళ్లంతా కుళ్లిపోయిన వ్యక్తి చంద్రబాబంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం అదికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఏదో ఒక రకంగా జగన్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని రథాలను తగలబెట్టడం, విగ్రహాలను పగల గొట్టడం చేశారని ఆయన అన్నారు. ఇదే దొంగల ముఠా ఆ తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కోనసీమ చిచ్చు రేపారని కొడాలి నాని ఆరోపించారు. 

ఎమ్మెల్యే , మంత్రి ఇల్లు తగలబెట్టారని.. లోకేష్ ఎక్కడ ఎవరు చనిపోయినా టీడీపీ కార్యకర్త అంటూ శవాలను పట్టుకుని ఊరేగుతాడంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడు కొత్తగా మధ్యంలో విషం అంటూ ప్రచారం మొదలు పెట్టారని.. ఈనాడు, జ్యోతిలో ముందు ఒక వార్త రాయిస్తారని ... మరుసటి రోజు దానిపై గ్లోబల్ తాత చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ పెడతాడంటూ నాని సెటైర్లు వేశారు. మద్యంలో  లేదు...బాటిల్ పైనే హానికరం అని ఉంటుందని ఆయన అన్నారు. దానికి వీళ్ళు ల్యాబ్ కి వెళ్లి చెక్ చేయించేది ఏంటీ అని నాని ప్రశ్నించారు. 

ఒక పద్దతి ప్రకారం .. వీళ్ళు ఎవరి వద్ద సర్టిఫికేట్ తెచ్చారు...? టీడీపీ ఆఫీస్ లో చెక్ చేయించారా అని ఆయన నిలదీశారు. లోడ్ చెక్ చేసిన తర్వాతే గోడౌన్ కి వెళ్తుందని.. అన్ని బోగస్ మాటలు చెప్పి హడావుడి చేస్తారని నాని మండిపడ్డారు. అరబిందో ఫార్మాను 1964లో స్థాపించారని.. ఏపీతో పాటు 24 మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఉన్నాయని ఆయన అన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలు వారు ఎగుమతి చేస్తారని.. అలాంటి కంపెనీ ఎన్ని ప్రమాణాలు తీసుకుంటాయి ఆలోచించాలని కొడాలి నాని చెప్పారు. 

ALso REad:వారసులను గెలిపించాలి.. ఇల్లరికపు అల్లుళ్లను కాదు, అన్నగారి వారసుడు జూనియర్ ఎన్టీఆరే : కొడాలి నాని వ్యాఖ్యలు

ఒక్కో దేశంలో ఒక్కో వాతావరణ పరిస్థితి ఉంటుందని.. దాన్ని బట్టి మందులు తయారు చేస్తారని ఆయన తెలిపారు. వాళ్ళు విషం కలిపితే అంతర్జాతీయ కోర్టులో పెట్టీ జైల్లో పెడతారని నాని ఎద్దేవా చేశారు. దానికి ఒక మెడికల్ కౌన్సిల్ ఉంటుందని.. విజయసాయిరెడ్డి వియ్యంకుడుది కాబట్టి విషం కలిపారు అని ఆరోపణ చేస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. అమెరికాలో అరబిందో రిపోర్ట్ ఇచ్చిందట...వీళ్ళకి వచ్చిందట అంటూ ఆయన సెటైర్లు వేశారు. రేపు బి, నీళ్ళలో కూడా విషం కలిపింది అంటాడంటూ దుయ్యబట్టారు.

నువ్వు, నీ దత్త పుత్రుడు, దుష్ట చతుష్టయం నా వెంట్రుక కూడా పీకలేరు అన్న మా నాయకుడి మాటకు మేమంతా కట్టుబడి ఉన్నామని కొడాలి నాని స్పష్టం చేశారు. జగన్ ప్రజలను నమ్మి వచ్చాడు...ఈ రోజు సీఎంగా ఉన్నాడని ఆయన గుర్తుచేశారు. నీ ఆటలు ఒకప్పుడు నడిచాయని.. ఇప్పు నడవదన్నారు. రాజీరావు చెబితే రాష్ట్రమంతా మారిపోతుందా అని నాని ప్రశ్నించారు. తమిళనాడు, కేరళలో హెరిటేజ్ నీ 2012లో బ్యాన్ చేశారని మాజీ మంత్రి గుర్తుచేశారు. దాంట్లో విషం ఉందని పిల్లల మెదడుకు సమస్య అని నిషేధించారని ఆయన వెల్లడించారు. 

చిన్నపిల్లలు తాగే పాలల్లో విషం కలపడానికి చంద్రబాబుకి సిగ్గులేదా అంటూ కొడాలి నాని మండిపడ్డారు. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధిక టాక్స్ కడుతున్నారని.. అరబిందో జగన్ బినామీలు అంటాడు...వాళ్ళు ఎప్పటినుంచి కోటీశ్వరులని ఆయన గుర్తుచేశారు. చారిటబుల్ ట్రస్ట్ పెట్టీ ప్రజలకు సేవ చేస్తున్న వారిని బినామీలు అంటారా అని కొడాలి నాని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి కుమార్తెకిక్రూయిజ్ షిప్ ఉందంటారు...అరబిందో వాళ్ళకి క్రూయిజ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటని ఆయన నిలదీశారు. 

అసలు చంద్రబాబు మనిషి జన్మ ఎత్తాడా.. దేన్నైనా సర్వనాశనం చేయాలనేది వారి ఉద్దేశ్యమంటూ కొడాలి నాని దుయ్యబట్టారు. కల్తీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబని, టీడీపీ ఎన్టీఆర్‌దని నాని అన్నారు. ఎన్టీఆర్ వారసులమని కల్తీ మాటలు చెప్పుకునే చంద్రబాబే కల్తీ అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక నెల రోజులు మీరు గాలి పీల్చినా చచ్చిపోతాడు అని చెబుతారని.. విషం ఎక్కడా లేదని, చంద్రబాబు బుర్రలో నరనరాన విషం వుందని నాని వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios