Asianet News TeluguAsianet News Telugu

మూతబడిన స్కూల్‌ను ఇంటిగా మార్చేసుకున్న వైసీపీ నేత!.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు..

మూతబడిన స్కూల్‌ను ఓ వైసీపీ నేతగా ఇంటిగా మార్చేసుకున్నారు. నంద్యాల జిల్లాలోని పాణ్యం ఇందిరానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌ను అక్రమించుకున్న ఆ వైసీపీ నేత తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

YSRCP leader Turns closed school into his home in nandyal district
Author
First Published Sep 10, 2022, 11:57 AM IST

మూతబడిన స్కూల్‌ను ఓ వైసీపీ నేతగా ఇంటిగా మార్చేసుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా పాణ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పాణ్యం ఇందిరానగర్‌‌లో చెంచు గిరిజన్ల కోసం 2013లో రాజీవ్‌ విద్యా మిషన్‌ నిధులతో ప్రాథమిక పాఠశాలను నిర్మించారు. అయితే విద్యార్థుల కొరతతో ఐదేళ్ల క్రితం పాఠశాల మూతబడింది. అయితే స్కూల్ మూతబడి ఉండటాన్ని గమనించిన ఓ వైసీపీ నేత దానిని అక్రమించుకున్నారు. 

స్కూల్ శిలఫలకాన్ని తొలగించి, రంగు మార్చేశారు. మెట్లు కూడ నిర్మించారు. ఇక, తరగతి గదుల్లోని బ్లాక్ బోర్డును తొలగించి.. వంట రూమ్, బెడ్ రూమ్‌గా మార్చేసుకున్నాడు. మొత్తంగా స్కూల్ రూపురేఖలు మార్చేసి ఇంటిగా మార్చుకున్నాడు. అయితే ఈ వ్యవహారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం తమకు తెలియదని.. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios