పులకు ఐదు శాతం రిజర్వేషన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ  విమర్శించారు. 


విశాఖపట్టణం: కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల పేరుతో టీడీపీ ప్రభుత్వం మోసం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు.

గురువారం నాడు విశాఖపట్టణంలో మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.బాబు ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో మోసం చేస్తోందన్నారు.

ఎన్నికలు వస్తున్నందున కాపులకు రిజర్వేషన్ల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.