వైఎస్ వివేకా హత్య కేసు.. ఎవరీ సుబ్బరాయుడు..?
అసలు ఎవరీ సుబ్బరాయుడు అనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది.కాగా.. ఈ సుబ్బరాయుడు కడపకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులు ఎవరో ఇప్పటి వరకు బయటకు రాలేదు. కనీసం ఈ ఘటన ఎలా జరిగిందనే విషయం కూడా బయటకు రాలేదు. కాగా.. తాజాగా ఈ కేసులో మరో వ్యక్తి పేరు బయటకు వచ్చింది.
సుబ్బరాయుడు అనే వ్యక్తిపై వివేకా కుమార్తె సునీతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. అసలు ఎవరీ సుబ్బరాయుడు అనే విషయం తీవ్ర చర్చనీయాంశమైంది.కాగా.. ఈ సుబ్బరాయుడు కడపకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అసలు ఈ సుబ్బరాయుడుపై సునీత ఎందుకు ఫిర్యాదు చేశారు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఈ సుబ్బరాయుడు.. ఇటీవల వివేకా కేసుకు సంబంధించిన సాక్ష్యాల వివరాలు కావాలంటూ సెంట్రల్ గ్రీవెన్ సెల్ ను కోరాడు. అలాగే వివేకా కుమార్తె సునీతను కూడా అదుపులోకి తీసుకొని విచారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశాడు. ఈ విషయం సునీత సెల్కు మెయిల్ వెళ్లడంతో సుబ్బరాయుడుపై కేసు నమోదుచేసి చర్యలు చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో పులివెందుల డీఎస్పీకి సునీత ఫిర్యాదు ఇచ్చారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.